Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ చతుర్థాధ్యాయః

అథ వరాహాద్యవతార వర్ణనమ్‌.

అగ్ని రువాచ :-

అవతారం వరాహస్య వక్ష్యేహం పాపనాశనమ్‌ | హిరణ్యాక్షో7సురేశో7భూద్దేవాఞ్జీత్వా దివి స్థితః. 1

అగ్ని దేవడు పలికెను : పాపములను నశింపచేయు వరాహావతారమును గూర్చి చెప్పెదను. హిరణ్యాక్షుడనెడు రాక్షసరాజు ఉండెను. అతడు దేవతలను జయించి స్వర్గలోకములో నివసించెను.

దేవైర్గత్వా స్తుతో విష్ణుర్యజ్ఞరూపో వరాహకః | అద్భుతం దానవం హత్వా దైత్యైః సాకం చ కణ్టకమ్‌. 2

ధర్మదేవాది రక్షాకృత్తతః సో7న్తర్దధే హరిః |

యజ్ఞస్వరూపు డగు విష్ణువును దేవత లందరును వచ్చి స్తుతింపగా ఆ హరి వరాహరూపము ధరించి, లోకకంటకు డైన ఆ దానవుని దైత్యులతోకూడ ఆశ్చర్యకర మగు విధమున సంహరించి, ధర్మమును దేవతలు మొదలగువారిని రక్షించి అంతర్థానము చెందెను.

హిరణ్యాక్షస్య వై బ్రాతా హిరణ్యకశిపు స్తథా. 3

జితదేవయజ్ఞ భాగః సర్వదేవాదికాకృత్‌ |

హిరణ్యాక్షుని సోదరుడైన హిరణ్యకశిపుడు దేవతల యజ్ఞభాగములను అపహరించి దేవతలందరిపైనను అధికారమును జరిపెను.

నారసింహం వపుః కృత్వా తం జఘాన సురైఃసహ. 4

స్వపరస్థన్‌ సురాంశ్చ క్రే నారసింహః సురైః స్తుతః |

విష్ణువు దేవతాసమేపతుడై (వెళ్లి) నరసింహరూపము దాల్చి ఆ హిరణ్యకశిపుని సంహరించెను. దేవతలచే స్తుతింపబడిన ఆ నరసింహుడు దేవతలను తమతమ స్థానములలో నిలిపెను.

దేవాసురే పురా యుద్ధే బలిప్రభృతిబిః సురాః. 5

జితాః స్వర్గాత్పరిభ్రష్టా హరిం వై శరణం గతాః |

పూర్వము దేవాసుర యుద్దమునందు బలి మొదలగువారిచే సురులు పరాజితులై, స్వర్గమును కోల్పోయిరి. వారు అపుడు హరిని శరణుజొచ్చిరి.

సురాణామభయం దత్త్వా అదిత్యా కశ్యపేన చ. 6

స్తుతో 7సౌ వామనో భూత్వా హ్యదిత్యాం స క్రతుం య¸° |

బలేః శ్రీయజమానస్య రాజద్వారే7గృణాచ్ర్ఛుతిమ్‌.

విష్ణువు దేవతలకు అభయ మిచ్చి, అదితికశ్యపులు తనను స్తుతింపగా ఆదితియందు వామనుడగ జన్మించెను. ఆ వామనుడు శోభాయుక్తముగ యజ్ఞము చేయుచున్న బలి చక్రవర్తి యజ్ఞమునకు వెళ్లి అచట రాజద్వారమునందు వేదమును పఠించెను.

వేదాన్పఠన్తం తం దృష్ట్వా వామనం వరదో7బ్రవీత్‌ | నివారితో7పి శుక్రేణ బలిర్ర్బూహి యదిచ్ఛసి. 8

తత్తే7హం సంప్రదాస్యామి వామనో బలిమబ్రవీత్‌ | పదత్రయం హి గుర్వర్థం దేహి దాస్యే తమబ్రవీత్‌. 9

బలి వేదములను పఠించుచున్న ఆ వామనుని చూచి, ఆతడు కోరు కరముల నీయవలెనని నిశ్చయించుకొని, శుక్రాచార్యుడు నివారించుచున్నను, ఆతనితో '' నీ కేమి కావలెనో కోరుకొనుము; ఇచ్చెదను '' అని పలికెను. వామనుడు బలితో ఇట్లనెను : ''మూడు అడుగుల నిమ్ము; నా గురువునకు కావలెను''. బలి ''అట్లె ఇచ్చెదను'' అని పలికెను.

తోయే తు పతితే హస్తే వామనో7భూదవామనః | భూర్లోకం స భువర్లోకం స్వర్లోకం చ పదత్రయమ్‌. 10

చక్రే బలిం చ సుతలే తచ్ఛక్రాయ దదౌ హరిః | శక్రో దేవైర్హరిం స్తుత్వా భువనేశః సుఖీ త్వభూత్‌. 11

దానజలము చేతిలో పడగానే వామనుడు అవామనుడ (పెద్ద శరీరము కలవాడు) ఆయెను. భూలోక-భువర్లోక-స్వర్లోకములను మూడడుగులుగా గ్రహించి బలిని సుతలమునకు త్రొక్కివేసెను. వామనరూపుడైన హరి ఆ లోక త్రయమును దేవేంద్రున కిచ్చెను. దేవతాసహితు డగు ఇంద్రుడ హరిని స్తుతించి, త్రిభువనాధీశుడై సుఖముగా నుండెను.

వక్ష్యే పరశురామస్య చావతారం శృణు ద్విజ | ఉద్ధతాన్‌ క్షత్రియాన్‌ మత్వా భూభార హరణాయ సః. 12

అవతీర్ణో హరిః శాన్త్యై దేవవిప్రాదిపాలకః | జమదగ్నే రేణుకాయాం భార్గవః శస్త్రపారగః. 13

ఓ బ్రాహ్మణా! పరశురాముని అవతారమును గూర్చి చెప్పెదను వినుము. ఆ శ్రీమహావిష్ణువు, క్షత్రియులు ఉద్దతులుగా ఉన్నా రని తలచి, భూబారమును హరించుటకై, దేవతలను, విప్రాదులను పాలింపనున్నవాడై, శాంతిని నెలకొల్పుటకై, జమదగ్నినుండి రేణుకయందు సర్వశాస్త్రవిద్యాపారంగతు డైన భార్గవుడుగా (పరశురాముడుగా) ఆవతరించినాడు.

దత్తాత్రేయప్రసాదేన కార్తవీర్యో నృపస్త్వభూత్‌ | సహస్రబాహుః సర్వోర్యీపతిః స మృగయాం గతః. 14

కార్తవీర్యుడను రాజు దత్తత్రేయుని అనుగ్రహముచే వేయిబాహువులు కలవాడుగను, సకల భూమండలమునకును రాజుగను ఆయెను. అతడు వేటకు వెళ్లెను.

శ్రాన్తో నిన్త్రితో7రణ్య మునినా జమదగ్నినా | కామధేనుప్రభావేణ భోజితః సబలో నృపః. 15

అరణ్యములో అలసిన సేనానమేతు డైన ఆ రాజును జమదగ్ని మహర్షి నిమంత్రించి కామధేనవు ప్రభావముచేత భోజనము పెట్టెను.

అప్రార్థయత్కామధేను యదా స న దదౌ తదా | హృతవానథ రామేణ శిరశ్ఛిత్వా నిపాతితః. 16

యుద్ధే పరశునా రాజా సధేనుః స్వాశ్రమం య¸° |

కార్తవీర్యార్జునుడు ఆ కామధేనువును తన కిమ్మని కోరెను. జమదగ్ని ఈయ నిరాకరించెను. ఆపుడాతడు దానిని అపహరించెను. పిదప పరశురాముడు యుద్దములో పరశువుచే అతని శిరస్సు ఛేదించి సంహరించి ధేనువుతో ఆశ్రమమునకు తిరిగి వెళ్లెను.

కార్తవీర్యస్య పుత్త్రెస్తు జమదగ్నిర్ని పాతితః. 17

రామే వనం గతే వైరాదథ రామః సమాగతః | పితరం నిహతం దృష్ట్వా పితృనాశాభిమర్షితః. 18

త్రిఃసప్తకృత్వః పృథివీం నిఃక్షత్రామకరోద్విభుః |

కురుక్షేత్రే పఞ్చకుణ్డాన్‌ కృత్వా సన్తర్ప్య వై పితౄన్‌.

కశ్యపాయ మహీం దత్వా మహేన్ద్రే పర్వతే స్థితః |

పరశురాముడు వనమునకు వెళ్ళి యుండగా కార్తవీర్యుని పుత్రులు పూర్వవైరమువలన జమదగ్నిని చంపిరి. అంత తిరిగి వచ్చిన ప్రభావశాలి యగు పరశురాముడు చంపబడిన తండ్రిని చూచి, తండ్రిని ఆ విధముగ చంపుటచే కోపించి, ఇరువదియొక్క పర్యాయములు పృథివిని క్షత్రియులు లేనిదానినిగాచేసి, కురుక్షేత్రమునందు ఐదు కుండములను చేసి, వాటితో పితృదేవతలను తృప్తిపరచి, భూమి నంతను కశ్యపునకు దానము చేసి, మహేంద్రపర్వతముపై నివసించెను.

కూర్మస్య చ వరాహస్య నృసింహస్య చ వామనమ్‌ |

అవతారం చ రామస్య శ్రుత్వా యాతి దివం నరః. 20

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే వరాహనృసింహాద్యవతారో నామ చతుర్థో7ధ్యాయః.

కూర్మ, వరాహ, నరసింహ, పరశురామావతారగథలు విన్న మానవుడు స్వర్గమునకు వెళ్లును.

అగ్ని మహా పురాణములో వరాహనృసింహాద్యవతార మనెడు చతుర్థాధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters