Siva Maha Puranam-3    Chapters   

అథ ఏకోన చత్వారింశో%ధ్యాయః

శివరాత్రి వ్రతోద్యాపనము

ఋషయ ఊచుః |

ఉద్యాపనవిధిం బ్రూహి శివరాత్రివ్రతస్య చ | యత్కృత్వా శంకరస్సాక్షాత్ప్రసన్నో భవతి ధ్రువమ్‌ ||1

ఋషులు ఇట్లు పలికిరి-

దేనిని అనుష్టించినచో శంకరుడు స్వయముగా ప్రసన్నుడగుట నిశ్చితమో, అట్టి శివరాత్రివ్రతము యొక్క ఉద్యావనవిధిని చెప్పుము(1).

శ్రూయతామృషయో భక్త్వా తదుద్యాపవమాదరాత్‌ | యస్యానుష్ఠానతః పూర్ణం వ్రతం భవతి తద్ద్రువమ్‌ ||2

చతుర్దశాబ్దం కర్తవ్యం శివరాత్రివ్రతం శుభమ్‌ | ఏకభక్తం త్రయోదశ్యాం చతుర్దశ్యాముపోషణమ్‌ ||3

శివరాత్రిదినే ప్రాప్తే నిత్యం సంపాద్యవై విధిమ్‌ | శివాలయం తతో గత్వా పూజాం కృత్వా యథావిధి|| 4

తతశ్చ కారయేద్దివ్యం మండలం తత్ర యత్నతః| గౌరీతిలకనామ్నావై ప్రసిద్ధం భువనత్రయే|| 5

తన్మధ్యే లేఖయేద్దివ్యం లింగతో భద్రమండలమ్‌ | అథవా సర్వతోభద్రం మండపాంతః ప్రకల్పయేత్‌ ||6

కుంభాస్తత్ర ప్రకర్తవ్యాః ప్రాజాపత్యవిసంజ్ఞయా | సవస్త్రా స్సఫలాస్తత్ర దక్షిణాసహితాశ్శుభాః || 7

మండలస్య చ పార్శ్వే వై స్థాపనీయాః ప్రయత్నతః | మద్యే చైకశ్చ సంస్థాప్యస్సౌవర్ణో వాపరో ఘటః|| 8

సూతుడు ఇట్లు పలికెను-

ఓ ఋషులారా! ఆ ఉద్యావనవిధిని భక్తిశ్రద్ధలతో వినుడు. దానిని అనుష్ఠించుటతోడనే ఆ వ్రతము నిశ్చయముగా పూర్ణమగును(2). శుభకరమగు శివరాత్రివ్రతమును పదునాల్గు సంవత్సరములు చేయవలెను. త్రయెదశినాడు ఒక పూట భోజనమును చేసి, చతుర్దశినాడు ఉపవాసమునుండవలెను(3). శివరాత్రి సంప్రాప్తము కాగానే నిత్యనిధిని అనుష్టించి, తరువాత శివాలయమునకు వెళ్లి యథావిధిగా పూజను చేసి(4) , తరువాత అచట ముల్లోకములలో గౌరీతిలకమని ప్రసిద్ధిని గాంచిన దివ్యమగు మండపమును ప్రయత్నపూర్వకముగా చేయవలెను (5). ఆ మండలమునకు మధ్యలో లింగతోభద్రము, లేదా సర్వతో భద్రము అనే ముగ్గును వేయవలెను(6). వస్త్రము, ఫలము మరియు దక్షిణలతో కూడిన శుభకరమగు కుంభములను అచట ప్రాజాపత్యవిధానముతో స్థాపించవలెను(7). కుంభములను మండపమునకు ప్రక్కలయందు జాగ్రత్తగా ఉంచవలెను. మధ్యలో ఒక బంగరు కుండను, లేదా మరియొక కుండను ఉంచవలెను(8).

తత్రోమాసహితాం శంభుమూర్తిం నిర్మాయ హాటకీమ్‌ | పలేన వా తదర్ధేన యథాశక్త్వాథవా వ్రతీ|| 9

నిధాయా వామభాగే తు శివమూర్తిమతంద్రితః | మదీయాం దక్షిణ భాగే కృత్వా రాత్రౌ ప్రపూజయేత్‌ || 10

ఆచార్యం వరయేత్తత్ర చర్త్విగ్భిస్సహితం శుచిమ్‌ | అనుజ్ఞాతశ్చ తైర్భక్త్యా శివపూజాం సమాచరేత్‌ || 11

రాత్రౌ జాగరణం కర్యాత్పూజాం యామోద్భవాం చరన్‌ | రాత్రిమాక్రమయేత్సర్వాం గీతనృత్యాదినా వ్రతీ || 12

ఏవం సంపూజ్య విధివత్సంతోష్య ప్రాతరేవచ |పునః పూజాం తతః కృత్వా హోమం కుర్యాద్యథావిధి|| 13

యథాశక్తి విధానం చ ప్రాజాపత్యం సమాచరేత్‌ | బ్రాహ్మణాన్‌ భోజయేత్ప్రీత్యా దద్యాద్దానాని భక్తితః || 14

ఋత్విజశ్చ సపత్నీకాన్‌ వస్త్రాలంకారభూషణౖః | అలంకృత్య విధానేన దద్యాద్ధానం పృథక్‌ పృథక్‌ ||15

వ్రతమును చేయువాడు పలము, లేక అర్ధపలము, బంగారముతో, లేదా యథాశక్తిగా చేసిన పార్వతీపరమేశ్వరుల మూర్తిని నిర్మించి అచట ఉంచవలెను(9). శివుని మూర్తిని కుడివైపున, పార్వతి మూర్తిని ఎడమవైపున ఉంచి రాత్రియందు శ్రద్ధతో పూజించవలెను(10). ఆ సమయములో ఋత్వికులతో సహా ఆచార్యుని వరణము చేసి, వారి అనుజ్ఞతో భక్తిపూర్వకముగా శివుని పూజించవలెను(11). వ్రతనిష్ఠ గల భక్తుడు రాత్రియందు ప్రతియామమునందు పూజను చేయుచూ, జాగరణము చేయవలెను. వ్రతమును చేయువాడు రాత్రి అంతయు గాననాట్యదులతో గడుపవలెను(12). ఈ విధముగా యథావిధిగా పూజించి శివుని ప్రసన్నని చేసి ఉదయమే మరల పునఃపూజను చేసి యథావిదిగా హోమమునుచేయవలెను(13). శక్తిని అనుసరించి ప్రాజాపత్యవ్రతమును చేసి బ్రాహ్మణులకు ప్రీతిపూర్వకముగా భోజనమునిడి భక్తితో దానము చేయవలెను(14). భార్యలతో కూడియున్న ఋత్విక్కులను వస్త్రములతో మరియు ఆభరణములతో అలంకరించి వేర్వేరుగా యథావిధిగా దానములను చేయవలెను(15).

గాం సవత్సాం విధానేన యథోపస్కరసంయుతామ్‌ | ఉక్త్వాచార్యుయవై దద్యాచ్ఛివో మే ప్రీయతామితి|| 16

తతస్సకుంభాం తన్మూర్తిం సవస్త్రాం వృషభే స్థితామ్‌ | సర్వాలంకారసహితామాచార్యాయ నివేదయేత్‌ || 17

తతస్సంప్రార్థయేద్ధేవం మహేశానం మహాప్రభుమ్‌ | కృతాంజలిర్నతస్కంధస్సుప్రీత్యా గద్గదాక్షరః || 18

దేవదేవ మహాదేవ శరణాగతవత్సల| ప్రతేనానేన దేవేశ కృపాం కురు మమోపరి|| 19

మయా భక్త్యనుసారేణ వ్రతమేతత్కృం శివ| న్యూనం సంపూర్ణతాం యాతు ప్రసాదాత్తవ శంకర|| 20

అజ్ఞానాద్యది వా జ్ఞానాజ్జపపూజాదికం మయా | కృతం తదస్తు కృపయా సఫలం తవ శంకర|| 21

ఏవం పుష్పాంజలిం దత్త్వా శివాయ పరమాత్మనే | నమస్కారం తతః కుర్యాత్ర్పార్థనాం పునరేవ చ || 22

ఏవం వ్రతం కృతం యేన న్యూనం తస్య న విద్యతే| మనోభీష్టాం తతస్సద్ధిం లభ##తే నాత్ర సంశయః || 23

ఇతి శ్రీ శివమహాపురాణ కోటిరుద్రసంహితాయాం శివరాత్రివ్రతో ద్యాపనం నామ ఏకోనచత్వారింశో ధ్యాయః(39)

దూడ, ఇతరములైన అలంకారములు మరియు ఉపకరణములతోకూడియున్న ఆవును యథావిధిగా ఆచార్యునకు ఇచ్చి, శివుడు నాయందు ప్రీతిని పొందుగాక అని పలుకవలెను(16). తరువాత కుంభములతో మరియు వస్త్రాది సర్వాలంకారములతో కూడియున్న మూర్తులను ఎద్దుపైననుంచి ఆచార్యునకు నివేదించవలెను. తరువాత మహేశ్వరుడు, మహాప్రభుడుఅగు దేవుని చేతులను జోడించి తలను వంచి నమస్కరించి పరమప్రీతి వలన గద్గదమైన వాక్కుతో చక్కగా ప్రార్థించవలెను(18). ఓ దేవదేవా! మహాదేవా! శరణు పొందినవారియందు ప్రీతి గలవాడా! ఓ దేవేశా! ఈ వ్రతమును చేసిన నాపైన దయను చూపుము(19). ఓ శివా! నేను భక్తిపూర్వకముగా ఈ వ్రతమును చేసితిని. ఓ శంకరా! నీ అనుగ్రహముచే లోపములేవైన ఉన్ననూ సంపూర్ణమగుగాక! (20) ఓ శంకరా!నేను తెలిసిగాని, తెలియకగాని జపపూజాదులలో దోషమును చేసియున్ననూ, నీ కృపచే సర్వము సఫలముగుకాక! (21) ఈ విధముగా శివపరమాత్మకు పుష్పాంజలి ఇచ్చి నమస్కరించి తరువాత మరల ప్రార్థించవలెను(22). ఈ విధముగా చేయువానికి వ్రతములో లోపమేమియు ఉండదు. దానివలన ఆతనికి నిస్సందేహముగా మనోభీష్టము సిద్ధించును(23).

శ్రీ శివమహాపురాణములోని కోటిరుద్రసంహితయందు శివరాత్రోద్యాపనమును వర్ణించే ముప్పది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది(39)

Siva Maha Puranam-3    Chapters