Sri Vamana Mahapuranam    Chapters   

శ్రీ వామన పురాణ పంచ చత్వారిం శోధ్యాయః 45

నారద ఉవాచ -

మలయే7పి మహేంద్రేణ యత్కృతం బ్రాహ్మణర్షభ! నిష్పాదితం స్వకం కర్యం | తన్మే వ్యాఖ్యాతు మర్హసి. 1

పులస్త్య ఉవాచ -

శ్రూయతాం యన్మ హేంద్రేణ | మలయే పర్వతోత్తమే | కృతం లోకహితం బ్రహ్మ | న్నాత్మనశ్చ తథా హితమ్‌|| 2

అంధాసురస్యానుచరా| మయ తార పురోగమాః | తే నిర్జితాః సురగణౖః| పాతాళ గమనోత్సు కాః || 3

దదృశు ర్మలయం శైలం | సిద్ధాధ్యుషిత కందరమ్‌ | లతా వితాన సంఛన్నం | మత్త సత్త్వ సమాకులమ్‌ || 4

చందనై రురగాక్రాంతైః| సశీతై రభిసేవిత్‌ | మధవీ కుసుమా మోదం | ఋష్యర్చిత హరం గిరమ్‌|| 5

తం దృష్ట్వా శీతల చ్చాయం| శ్రాంతా వ్యాయామ కర్షితాః| మయ తారపురోగాస్తే| నివాసం సమరో చయన్‌|| 6

తేషు తత్రోపవిష్టేషు| ప్రాణ తృప్తి ప్రదో%నిలః| వివాతి శీతః శనకై| ర్దక్షిణో గంధ సంయుతః|| 7

తత్రైవ చ రతించక్రుః| సర్వ ఏవ మహాసురాః | కుర్వంతో లోక సంపూజ్యే| విద్వేషం దేవతా గణౖః|| 8

తాన్‌ జ్ఞాత్వాశంకరః శక్రం| పై#్రషయ స్మలయేసురాన్‌ | స చాపి దదృశే గచ్చన్‌| పథి గోమాతరం హరిః|| 9

తస్యాః ప్రదక్షిణాం కృత్వా| దృష్ట్వా శైలం చ సుప్రభమ్‌| దదృశే దానవాన్‌ సర్వాన్‌| సంహృష్టాన్‌ భోగ సంయుతాన్‌ ||10

తథాజుహా బలహా| సర్వానేవ మహాసురాన్‌| తే చాప్యాయయు రవ్యగ్రా| వికిరంతః శరోత్కరాన్‌ || 11

తానాగతాన్‌ బాణజాలైః రథ స్థో%ద్భుత దర్శనం | దఛాయామాసవిప్రర్షే!| గిరీన్‌ వృష్ట్వా యథా ఘనః || 12

తతో బాణౖ రవచ్ఛాద్య| మయా దీన్‌ దానవాన్‌ హరిః| సాకం జఘాన తీక్షాగ్రై ర్మార్గణౖః కంకవాససైః|| 13

తత్ర నామ విభుర్లేభే| శాసనత్వాశ్చరై ర్దృఢైః| పాక శాసనతాం శక్రః| సర్వామర పతిర్‌ విభుః|| 14

తథా%న్యం పురనామానం | బాణాసుర సుతం శ##రైః| సపుంఖైర్దారయా మాస| తతో% భూత్సపురందరః|| 15

నారదుడిలా అడిగాడు c

ఓ బ్రాహ్మణ శ్రేష్ఠా! మలయ పర్వతం మీద యింద్రుడు తన స్వంత పనులెలా నిర్వర్తించుకొనెనో ఆ వివరాలు తెలయ చెప్పండి. అందుల కాపులస్త్యుడో నారదా ! మలయ పర్వతానికి వెళ్లి యింద్రుడు నిర్వర్తించిన లోకహిత కార్యమూ తన కార్యమూ చెబుతున్నా వినుము. అంధకాసురుడి అనుచరులలో, యుద్ధంలో ఓడిపోయిన మయ తారాది రాక్షసులు పాతాళానికి వెళ్లవలెనని ఉత్సహించి వెళ్లుతూ దారిలో సిద్ధులకు నివాసాలయిన గుహలతో లతా సమూహాలతో మదించిన మృగాదులతో అలరారే మలయ పర్వతాన్ని చూచారు. మహా సర్పాలతో చుట్టుకొనబడిన చల్లని చందన తరువులతో మాధవీ కుసుమ పరిమళంతో నిండిన ఆ గిరి మీద ఋషులు శివార్చనలు గావిస్తున్నారు. యుద్ధ వ్యాయామంతో అలసి పోయిన మయుడు, తారుడు మొదలయిన రాక్షసుల చ్చటి చల్లని వాతావరణం చూచి ఆ చెట్ల నీడల్లో కూర్చొనియుండగా, సుగంధంతో కూడిన దక్షిణ వాయువు మెల్లగా వీచినది. ఆ సుఖానికి ముగ్ధులై వారచటనే స్థిరంగా ఉండిపోయారు. లోక పూజ్యులైన దేవతలను ద్వేషించ సాగారు. ఆ విషయం తెలిసి కొనిన శివుడు యింద్రుణ్ణీ దేవతలనూ అక్కడకు పంపాడు. దారిలో ఆ దేవరాజుకు కామధేనువు కనిపించగా నాతడా గోమాతకు ప్రదక్షిణం చేసి, అందమైన మలయగిరినీ, అచట యిష్ట భోగాల్లో మునిగియున్న దానవులందరనూ చూచాడు. వెంటనే ఆ బలారి ఆ రాక్షసులను యుధ్ధానికాహ్వనించగా వారంతా బాణ వర్షం కురిపిస్తూ ఆయన మీద కెత్తి వచ్చారు. అద్భుత దర్శనుడైన ఆ శక్రుడు రథం మీద కూర్చొని, ఓ నారదా! కొండలను మేఘాలను మేఘాలు కమ్ముకున్నట్లు ఆ దానవులను తన బాణాలతో కప్పి వేశాడు. అలా మయుడు మొదలయిన రాక్షసులను బాణాలతో ముంచెత్తి పాకుడనే మహాసురుణ్ణి వాడిమొనగల్గి గ్రద్ద ఈకలతో అలంకరించబడిన బాణాలతో సంహరించాడు. పాక దానవుని శాసించినందున ఆయన కానాటి నుండి పాకశాసనుడను పేరు కలిగింది. బాణసుర పుత్రుడైన పురుడనే మరొక రాక్షస వీరుణ్ణి బాణ పరంపరతో చీల్చి చెండాడి పురందరుడనే బిరుదు కూడ పొందాడు. - 15

హత్వత్థం సమరే జైషీద్‌గోత్ర భిద్దానవం బలమ్‌| తచ్చాపి విజితం బ్రహ్మన్‌ ! రసాతం ముపాగమ్‌|| 16

ఏతదర్థం సహస్రాక్షః| ప్రేషితో మలయా చీలమ్‌ త్య్రంబకేన మునిశ్రేష్ఠ!| కిమన్యచ్ఛ్రోతు మిచ్చసి? || 17

నారద ఉవాచ -

కిమర్థం దైవతపతిః గోత్రభిత్‌ కథ్యతే హరిః| ఏష మే సంశయో బ్రహ్మన్‌ హృది సంపరివర్తతే||

పులస్త్య ఉవాచ -

శ్రూయతాం గోత్రఖిచ్ఛక్రః కీర్తితో హి యధా మయా హతే హిరణ్యకశిపౌ యచ్చకారా రిమర్దనః|| 19

దితిర్వినష్ట పుత్రా తు కశ్యపం ప్రాహ నారద | విభో నాథో%సి మే దేహి శక్రహంతార మాత్మజమ్‌|| 20

కశ్యప స్తా మువాచా%థ యది త్వమసితేక్షణ! శౌచాచార సమాయుక్తా స్థాస్యతే దశతీ ర్దశ|| 21

సంవత్సరాణా దివ్యానాం తతసై#్రలోక్యనాయకమ్‌| జనయిష్యసి పుత్రం త్వం శత్రుఘ్నం నాన్యథా ప్రియే|| 22

ఇత్యేవముక్తా సాభర్త్రా దితి ర్నియమ మాప్థితా| గర్భాధానం ఋషీః కృత్వా జగామోదయ పర్వతమ్‌|| 23

గతే తస్మిన్‌ ముని శ్రేష్ఠే సహస్రాక్షో%పి సత్వరమ్‌ | తమాశ్రమ ముపాగమ్య దితిం వచన మబ్రవీత్‌|| 24

కరిష్యామ్యనుశుశ్రూషాం భవత్యా యది మన్యసే| బాఢ మిత్యబ్రవీ ద్దేవీ భావి కర్మ ప్రచోదితా|| 25

సమిదాహరణాదీన తస్యాశ్చ క్రే పురందరః| వినీతాత్మా చ కర్యార్థీ ఛిద్రాన్వేషి భుజంగవత్‌ || 26

ఏకదా సా తపోయుక్తా శౌచే మహతి సంస్థితా| దశవర్ష శతాంతే తు శిరః స్నాతా తప స్వినీ|| 27

జానుభ్యా ముపరిస్థాప్య ముక్త కేశా నిజంశిరః| సుష్వాస కేశప్రాంతైస్తు సంశ్లిష్ట చరణా% భవత్‌|| 28

తమంతర మశౌచస్య జ్ఞాత్వా దేవః సహస్రదృక్‌ | వివేశ మాతు రుదరం నాసారంధ్రేణ నారద! || 29

ప్రవిశ్య జఠరం కృద్ధో దైత్య మాతుః పురందరః| దదర్శోర్ద్వ ముఖం బాలం కటిన్యస్తకరం మహత్‌|| 30

అలా గోత్రభేది చేతిలో వారలు మడిసిన తర్వాత మిగిలిన రాక్షస బలాలు ఓడిపోయి పాతాళానికి వెళ్లిపోయాయి. ఈ పని నిర్వహించేందుకే త్రినేత్రుడు యింద్రుని మలయాచలానికి పంపాడు. ఇంకేమి వినగోరుతున్నావని పులస్త్యుడనగా నారడుడో బ్రహ్మర్షీ! ఇంద్రునకు గోత్రభేది యను పేరేల కలిగెనో చెప్పి నాసంశయం తీర్చండి అనగా నా పులస్త్యుడిలా చెప్పసాగాడు. నారదా! ఇంద్రుడు హిరణ్యకశిపు మరణానంతరం ఏమి చేసినదీ గోత్రభేది ఎలా అయినది సావధానంగా వినుము. తన కుమారులు చంపబడుట చూచి దితికశ్యప మహర్షిని, చేరి, నాధా! నా భర్తవగు నీవు నాకు ఇంద్రుని వధించగల పుత్రుని అనుగ్రహించుమని ప్రార్ధించింది. అందులకా కశ్యప మహర్షి, ప్రియురాలా! నీవు వంద దివ్య సంవత్సరాలు శుచిగా ఆచారానుష్ఠానం చేసినచో శత్రుహంత లోకాధిపతి అయిన పుత్రుడు కలుగుతాడని చెప్పగా నాదితి అందుకు సమ్మతించినది. అంతనా బ్రహ్మర్షి యీమెకు గర్భదానం చేసి తాను ఉదయగిరికి వెళ్లిపోయాడు. ఆ ముని వెళ్లిన వెంటనే సహస్రాక్షుడాశ్రమంలో చేరి, దితిని సమీపించి అమ్మా! నీ వంగీకరిస్తే ఈ స్థితిలో నీకు శుశ్రూష చేస్తానమ్మా అని అడిగాడు. అందుల కామె మంచిదని ఒప్పుకోగా ఆ పురందరుడు అత్యంత వినయంతో సమిధలు ఆకులు ఆమెకు తెచ్చియిస్తూ బిలం కోసం వెదకే మహావిషసర్పంలాగా, కార్యార్థియై ఆమెను కనిపెట్టి ఉన్నాడు. అలా తపోనిష్ఠలో ఉండగా, పది వందలేండ్లు పూర్తి కానుండగా ఆ తపస్విని తలకు స్నానం చేసి జుట్టు విరబోసికుని మోకాళ్లమీద తల ఆనించి, వెంట్రుకలు పాదాలకు తాకునట్లు వంగి చిన్నకునుకు తీసినది. అలా ఆమె అశుచిగా ఉండటం గమనించి వెంటనే ఆ సహస్రాక్షుడామె ముక్కరంధ్రాల్లో గుండా మాతృజఠరంలో ప్రవేశించాడు.అక్కడ నడుము మీద చేతులుంచుకుని పైకి చూస్తూ తేజస్వి అయిన శిశువును చూచాడు. ఆ బాలుని ముఖం మీద శుద్ధ స్పటికం లాంటి మాంసపేశి (ముక్క) ని చూచి రెండు చేతులతో పట్టుకొని కోపంతో ఆ శక్రుడు గట్టిగా నలిపాడు.అది పైభాగాన క్రింది భాగాన సాగి పెద్దదై నూరంచులుగల వజ్రంగా మారింది.

తస్యేవా స్యే%థ దదృశే పేశీం మాంసస్య వాసవ:| శుద్ధ స్పటిక సంకాశాం కరాభ్యాం జగృహే%థ తామ్‌|| 31

తతఃకోప సమాధ్మాతో మాంసపేశీం శతక్రతుః| కరాభ్యాం మర్దయామాస తతః సా కఠినా%భవత్‌ || 32

ఊర్ద్వేనా ర్ధంచ వవృధే త్వధో%ర్ధం వవృధే తథా,శత పర్వా%థకులిశః సంజాతో మాంసపేశితః || 33

తేనైవ గర్భం దితిజం వజ్రేణ శతపర్వణా, చిచ్ఛేద సప్తథా బ్రహ్మన్‌ ! స రురోద చ విస్వరమ్‌|| 34

తతో%ప్యబుధ్యత దితి రజానా చ్ఛక్రచేష్టితమ్‌, శుశ్రావ వాచం పుత్రస్య రుదమానస్య నారద! || 35

శక్రో%పి ప్రాహ మా మూఢ! రుదస్వేతి సుఘర్ఘరమ్‌, ఇత్యేవము క్త్వాచైకైకం భూయశ్చిచ్చేద సప్తథా|| 36

తే జాతా మరుతో నామ దేవభృత్యాః శత క్రతోః, మాతు రేవా పచారేణ చలంతే తే పురస్కృతాః || 37

తతః సకులిశః శక్రో నిర్గమ్య జఠరాత్తదా, దితిం కృతాంజలిపుటః ప్రాహ భీతస్తు శాపతః|| 38

మమాస్తినా%పరాధో%యం య చ్ఛస్త స్తనయ స్తవ తవైవాపనయాచ్ఛస్త స్తన్మేన క్రోద్ధు మర్హసి|| 39

దితి రువాచ -

నతావా త్రా పరాధో%స్తి మన్యే దిష్ట మిదంపురా | సంపూర్ణేత్వపి కాలే యా%శౌచత్వ ముపాగతా || 40

పులస్త్య ఉవాచ -

ఇత్యేవముక్త్వా తాన్‌ బాలాన్‌ పరిసాంత్వ్యదితిః స్వయమ్‌ | దేవరాజ్ఞా సహైతాంస్తు ప్రేషయామాస భామినీ || 41

ఏవం పురా స్వానపి సోదరాన్‌ | సగర్భస్థితా నుజ్జరితుం భయార్తః | బిభేద వజ్రేణ తతః సగోత్రభిత్‌ | ఖ్యాతో

మహర్షే ! భగవాన్‌ మహేంద్రః || 42

ఇతి శ్రీ వామన పురాణ పంచ చత్వారింశో%ధ్యాయః సమాప్తః

ఓ నారదా ! ఆ వజ్రంతోనే ఆ శక్రుడు దితి గర్భంలోని శిశువును ఏడు ముక్కలుగా ఖండించాడు.ఆ శిశువు కీచు గొంతుతో ఏడ్చాడు. మూర్ఖుడా! అలా కర్కశ ధ్వనితో ఏడువకు మంటూ మరల ఆ ఏడు ఖండాలను ఒక్కొక్కటి ఏడు ముక్కలుగా ఖండించాడు -ఆ ఏడుపు విని దితి మేల్కొని ఇంద్రుని దుశ్చేష్టితం తన పుత్రుని రోదనంగా తెలుసుకున్నది. "మారుద" "మారుద" ఏడవకుము ఏడవకుమంటూ ఇంద్రుడు ఖండించినందువలన ఆ నలభై తొమ్మిదిమంది మరుత్తులు అయ్యారు. తల్లి గావించిన అపచారం వల్ల అలా జన్మించి ఇంద్రుని భృత్యులై ముందు (వాయువులై) నడుస్తూ ఉంటారు. అంతట వజ్రపాణియై మాతృగర్భంలో నుంచి బయటకు వచ్చి శాపభయంతో దితి ఎదుట చేతులు జోడించి నిలచి - తల్లీ! నీకుమారుని మృతికి నేను కారణం కాదమ్మా. నీవు అశుచివైనందుననే యిలా జరిగినది. నామీద కోపపడకు తల్లీ! అని అర్ధించగా నామె "యిందులో నీ తప్పు లేదు బాబూ! దైవవిధియే యిలా ఉన్నది. కాకపోతే వ్రత పరిసమాప్తి దశ##లే నేనశుచిగా ఎందుకు ప్రవర్తించాలి! అని సమాధానపడినది. అంతట నాదితి ఆ బాలకులను సముదాయించి యింద్రుని వెంట పంపి వేసినది. నారదా! ఇలా పూర్వకాలంలో భయార్తుడై తన కుటుంబానికి (గోత్రానికి) చెందిన స్వంత సోదరులనే వజ్రంతో భిన్నం చేసినందున భగవంతుడైన మహేంద్రుడు గోత్రభిత్తుగా

పిలువబడినాడు. 42

ఇది శ్రీ వామన పురాణంలో నలుబది అయిదవ అధ్యాయము ముగిసినది.

Sri Vamana Mahapuranam    Chapters