Sri Matsya Mahapuranam-1    Chapters   

త్రయోదశో7ధ్యాయః.

శ్రాద్ధకల్పః-పితృవంశానువర్ణనమ్‌.

మనుః: 

భగవ న్ర్ఛోతు మిచ్ఛామి పితౄణాం వంశముత్తమమ్‌ | రమేశ్చ శ్రాద్దదదేవత్వం సోమస్య చ విశేషతః. 1

మత్స్యః: అహం తే కథయిష్యామి పితౄణాం వంశ ముత్తమమ్‌ |

స్వర్గే పితృగణా స్సప్త త్రయ స్తేషా మమూర్తయః. 2

మూర్తిమన్తోథ చత్వార స్సర్వేషా మమితౌజసః | అమూర్తయః పితృగణా వైరాజస్య ప్రజాపతేః. 3

యజన్తి యా న్దేవగణా వైరాజా ఇతి విశ్రుతాః | దివి తే యోగవిభ్రష్టాః ప్రాప్తుం లోకా స్త్సనాతనా9. 4

పున ర్ర్బహ్మదినాన్తే తు జాయన్తే బ్రహ్మవాదినః |

సమ్ర్పాప్య తాం స్మృతిం భూయో యోగం సాఙ్ఖ్య మనుత్తమమ్‌. 5

సిద్ధిం ప్రయాన్తి యోగేన పునరావృత్తి దుర్లభామ్‌ | యోగినామేవ దేయాని తస్మా చ్ర్ఛాద్ధాని దాతృభిః. 6

ఏతేషాం మానసీ కన్యా పత్నీ హిమవతో మతా | మైనాక స్తస్య దాయాదః* క్రౌఞ్చ స్తస్య సుతో7భవత్‌.

క్రౌఞ్చద్వీప స్స్మృతో యేన చతుర్థో ఘృతసంవృతః | మేనా తు సుషువే తిస్రః కన్యా యోగవతీ స్తతః. 8

ఉమైకపర్ణా7పర్ణా చ తీవ్రవ్రతపరాయణాః | రుద్రసై#్యకా భృగోశ్చైకా జై గిషవ్యస్య చాపరా. 9

త్రయోదశాధ్యాయము.

పితృవంశానువర్ణనము-వైరాజపితరుల చరితము.

మనువు మత్స్యనారాయణునితో ఇట్లు పలికెను : భగవన్‌! ఉత్తమమగు పితరుల వంశమును విన కుతూహల పడుచున్నాను. విశేషించి రవియు సోముడును శ్రాద్ధదేవులయిన వృత్తాంతమును వినగోరుచున్నాను.

మత్స్యనారాయణుడు ఇట్లు చెప్పనారంభించెను: అత్యంత ప్రధానమగు పితృవంశ వృత్తాంతమును నీకు తెలుపుదును. వినుము. స్వర్గలోకమునందు పితృదేవతాగణములు ఏడు కలవు. వీనిలో మూడు గణములు మూర్తి (రూపము లేనివి. మరి మిగిలిన నాలుగును మూర్తి కలవి. ఈ ఏడు గణముల పితరులును ప్రాణులందరలో అమిత మగు ఓజస్సు (సామర్థ్యము) కలవారు.

మూర్తిలేని పితరులు వై రాజుడు అను ప్రజాపతికి (కుమారులు) సంబంధించిన వారు. వీరు ద్యులోకమునందు ఉందురు. (మూర్తి లేని పితరులు బుద్ధిత త్త్వదశలోనివారును అమూర్తములగు ఆకాశవాయు భూతములతో రూపొందినవారును. మూర్తి కల పితరులు మూర్తములగు తేజో బూతముతో కూడ నిర్మితమయిన శరీరము కలవారు. జలపృథివీ భూతములు కూడ కలిసి వారి దేహమును నిర్మించినచో వారును భూలోకమునందలి మనవంటి ప్రాణులలోనివారే అగుదురు కాని దేవతలు కారు.) వీరినే ఎల్లవారును ఆరాధించుచుందురు. వైరాజులు అని ప్రసిద్ధిపొందిన ఈ అమూర్తములైన పితృ గణములవారు శాశ్వతములగు లోకములను పొందగోరి ఒకప్పుడు యోగసాధనము చేసి యోగమునుండి భ్రష్టులైనవారు. వీరిట్లు చాలకాలము పితృ దేవతలుగా నుందురు. కల్పావసానమైన తరువాత మరల సృష్టి ఆరంభము కాగానే వేదతత్త్వజ్ఞులుగా జన్మింతురు. వారపుడు తమ పూర్వ స్మృతి కలిగియుండి యోగసాధనమునకై సంకల్పింతురు. సర్వోత్తమమగు సాంఖ్యయోగమును ఆశ్రయించి పునరావృత్తి (మరల సంసారములోనికి వచ్చుట) లేని శాశ్వతగతిని పొందుదురు. ఇట్లు పితరులు యోగిరూపులు అని తెలియుచున్నది. కనుక లోకమునందు మానవులు కూడ శ్రాద్ధమునందు చేయు ఏదానము నై నను యోగము నెరిగి అనుష్ఠించువారికే చేయవలెను.

ఈ పితరుల మానసీ (మనస్సంకల్పముచేతనే కలిగిన) కన్య మేన అనునామె. ఆమె హిమవంతుని పత్నియైనది. హిమవంతుని కుమారుడు మైనాకుడు. అతని కొడుకు క్రౌంచుడు. అతని పేరుతోనే ఘృత సముద్రముతో చుట్టబడిన క్రౌంచద్వీపము ఏర్పడినది. ఇది ద్వీపములలో నాలుగవది.

'మేన'కు ముగ్గురు కుమార్తెలు కలిగిరి. వారు ఉమ-ఏకపర్ణ-అపర్ణ-అనువారు. వారు ముగ్గురును యోగసిద్ధి కలవారు. తీవ్రవ్రత పరాయణలు. తమ తపస్సుచే సర్వలోక జనులకంటె గొప్పవారు అగువీరిలో హిమవంతుడు ఉమను రుద్రునకును ఏకపర్ణను భృగువునకును అపర్ణను జై గిషవ్యునకును ఇచ్చి వివాహము చేసెను.

దత్తా హిమవతా బాలా స్సర్వలోకతపోధికాః |

ఋషయః: కస్మా ద్దాక్షాయణీ పూర్వం దదాహాత్మాన మాత్మనా. 10

హిమవద్దుహితా తద్వ త్కథం జాతా మహీతలే | శఙ్కరస్య కృతా7వజ్ఞా కథం వై బ్రహ్మసూనునా. 11

సంమరన్తీ కిముక్తా7సౌ సుతా వా బ్రహ్మసూనునా | దక్షేణ లోకజననీ సూత విస్తరతో వద |సూతః: దక్షస్య యజ్ఞే వితతే ప్రభూతవరదక్షిణ. 12

¨ సమాగతేషు దేవేషు ప్రోవాచ పితరం సతీ | కిమర్థం తాత భర్తా మే యజ్ఞే7స్మి న్న నిమన్త్రితః. 13

అయోగ్య ఇతి తా మాహ దక్షో యజ్ఞేషు శూలభృత్‌ | ఉపసంహారకో రుద్ర స్తేనామఙ్గళభా గయమ్‌. 14

చుకోపాథ సతీ దేహం త్యోక్ష్యామీతి తదుద్భవమ్‌ | దశానాం త్వం చ భవితా పితౄణా మేకపుత్త్రకః. 15

త్వత్కృతే త్వశ్వమేధశ్చ రుద్రాద్వై నాశ మేష్యతి | ఇత్యుక్త్వా యోగ మాస్థాయ స్వదేహోద్భవతేజసా. 16

నిర్దహన్తీ తదాత్మానం సదేవాసురకిన్నరై ః | కిం కి మేత దితి ప్రోక్తో గన్ధర్వగుణగుహ్యకైః. 17

ఉపగమ్యాబ్రవీ ద్దక్షః ప్రణిపత్యాథ దుఃఖితః | త్వ మస్య జగతో మాతా జగత్సౌభాగ్యదేవతా. 18

దుహితృత్వం గతా దేవి మమానుగ్రహకామ్యయా | న త్వయా రహితం కించి ద్ర్బహ్మాణ్డ7స్తి చరాచరమ్‌.

ప్రసాదం కురు ధర్మజ్ఞే మా మాం త్యక్తు మిహార్హసి | ప్రాహ దేవీ యథారబ్ధం తత్కార్యం మే న సంశయః.

కిం త్వవశ్య మహం మన్యే హతో యజ్ఞశ్చ శూలినా | ప్రసాద్య లోకసృష్ట్యర్థం తపః కార్యం మమాన్తికే.

ప్రజాపతి స్త్వం భవితా దశానాం మఙ్గళప్రదః | మదంశేనాఙ్గనా ష్టష్టి ర్భవిష్యన్త్యఙ్గజా స్తవ. 22

మత్సన్నిధౌ తపః కుర్వ న్ర్పాప్స్య సే యోగ ముత్తమమ్‌ | ఏవ ముక్తో7 బ్రవీ ద్దక్షః కేషు కేషు మయా7నఘే.

తీర్థేషు చ త్వం ద్రష్టవ్యా స్తోతవ్యా కైశ్చ నామభిః | దేవీ: సర్వదా సర్వభూతేషు ద్రష్టవ్యా సర్వతో భువి.

సప్తలోకేషు యత్కిఞ్చి ద్రహితం న మయా హి తత్‌ | తథాపి యేషు స్థానేషు ద్రష్టవ్యా సిద్ధి మీప్సుభిః. 25

స్మర్తవ్యా భూతికామైర్వా తాని వక్ష్యామి తత్త్వతః |

శౌనకాది ఋషులు సూతుని ఇట్లడిగిరి: ''పూర్వము దాక్షాయణి (దక్షుని కూతురు అగు సతి) తన దేహమును తానే ఏల కాల్చుకొనెను? ఆమె భూతలమున హిమవంతుని కూతురుగా ఎట్లు జన్మించెను? దక్షుడు బ్రహ్మమానస సుతుడైయుండియు శంకరుని ఎట్లు ఏల అవమానించెను? తన కూతురును లోక జననియు అగు సతి తన దేహమును కాల్చుకొను నప్పుడు దక్షుడు ఏమనెను? మాకు విస్తరంచి చెప్పుడు.''

________________________________________

¨ సమాహూదతేషు.

సూతుడు ఋషులతో ఇట్లు పలికెను: అధిక సంఖ్యగల శ్రేష్ఠములగు దక్షిణలతో దక్షుడు యజ్ఞమును వితతము (శ్రౌతకల్పమున చెప్పిన విధమున జరుపబడునది) చేయుచుండెను. (శివుడు తప్ప మిగిలిన) దేవతలు అందరును యజ్ఞమునకు వచ్చి యుండిరి. అపుడు సతీదేవి తన తండ్రిని ''నాయనా! ఈ యజ్ఞమునకు నాభర్తను ఏల పిలువలేదు?'' అని అడిగెను. శూలధారి యగు రుద్రుడు నీభర్త యజ్ఞములందు వచ్చుటకు యోగ్యుడు కాడు. అతడు సృష్టిని ఉపసంహరించు (నశింపజేయు) వాడు. అందుచేత అతడు అశుభములను ఆశ్రయించి యున్నవాడైనాడు. (శుభములకు పనికిరాడు.) అని దక్షుడు పలికెను. అంతట సతి కోపించెను. నీవలన ఉత్పన్నమైనందున నా ఈ దేహమును విడిచెదను. అని ఆమె పలికెను. నీవు పదిమంది తండ్రులకు ఒక్కడవే కుమారుడవు అయ్యెదవు. నీవు చేసిన ఈ దోషమునకు ఫలముగా నీ ఈ అశ్వమేధము రుద్రుని చేతిలో నాశమునందును. అని పలికి సతీదేవి యోగమును పూని తన దేహమునుండి ఉత్పన్న మయిన అగ్నితోనే తన శరీరమును దహింపజేసికొనుచుండెను. అది చూచి దేవతలు అసురులు గుహ్యకులు కిన్నరులు గంధర్యులును దక్షునితో ఇది ఏమి? (ఇట్లు జరుగనిచ్చితివి?) అనిరి. అంతట దక్షుడు ఆమె దగ్గరకు వచ్చి దుఃఖించుచు నమస్కరించి ఇట్లు పలికెను: ''నీవు ఈ జగత్తునకు మాతవు. జగత్తులకు సౌభాగ్యదేవతవు. నన్ను అనుగ్రహించు తలంపుతోనే నీవు నాకు పుత్త్రివయితివి. నీవు లేనిది నీవు కానిది ఈ బ్రహ్మాండము నందు చరము కాని అచరము కా (కదలునది కదలనిది) అగు ఏపదార్థమును లేదు. నీవు ధర్మము నెరిగినదానవు. నన్ను అనుగ్రహించుము. నన్ను విడువవలదని వేడుచున్నాను.''

దేవి దక్షునితో ఇట్లు పలికెను: ''నేను ఏమి చేయ సంకల్పించి ఆరంభించితినో అది నేను చేసియే తీరుదును. అందు సందేమములేదు. దేవి వస్తు స్థితిలో ఇచ్ఛాదిశ క్తి త్రయ స్వరూపురాలు-ఇచ్ఛ అనగా సంకల్పము. ఆమె తాను సంకల్పించిన దానిని తన జ్ఞానశ క్తితో ఆలోచించి క్రియా శక్తితో నిర్మాణము చేయును. అని త త్త్వమును అర్థము.) (నీవు నన్న నన్ను భ క్తితో ప్రార్థించుచున్నావు.) కాని నా సంకల్పానుసారము శివుని చేతిలో నీ యజ్ఞము నాశము కాక తప్పదు. నన్ను నుగ్రహింప జేసికొని నా దయచే లోక సృష్టిని సాధించుటకై నీవు నా సన్నిధిలో ఉండి తపస్సు ఆచరించుము. పదిమంది ప్రజాపతులలోను నీవు శుభకరుడవు అయ్యెదవు. నా అంశముతో నీకు అరువదిమంది కూతుండ్రు కలిగెదరు. నా సన్నిధిలో తపమాచరించినచో నీవు ఉత్తమమగు యోగసిద్దిని పొందెదవు.''

దేవి మాటలు విని దక్షు డామెతో ''ఏయే తీర్థములందు నీవున్నట్లు భావించి నిన్ను దర్శించవలెను? ఏ నామములతో నిన్ను స్తుతి చేయవలెను?'' అనెను.

దేవి ఇట్లు పలికెను: సర్వకాలములందును భూమియందలి (భూమిపై) సర్వ ప్రదేశములందు సర్వభూతములందును నేనున్నట్లు దర్శించవలయును. ఏలయన స ప్తలోకములందును ఏయే వస్తువులు కలవో వానిలో ఏయెక్కటియు నేను లేనిదియు నేను కానిదియు లేదు. ఐనను తాము కోరిన ఫలములు సిద్దింపగోరినవారు కాని అభ్యుదయమునో నిఃశ్రేయసమునో కోరినవారు (ఇహ-పరసుఖముల కోరినవారు) కాని ఏయే స్థానములందు నన్ను (ఏరూపమున) స్మరింపవలెనో వాటిని వాస్తవ స్థితిలో చెప్పుచున్నాను.

దక్షాయ దేవీప్రోక్తస్వీయాష్టో త్తరశతస్థానాని.

వారాణస్యాం విశాలాక్షీ నైమి శే లిఙ్గధారిణీ. 26

ప్రయాగే లలితా దేవీ కాముకా గన్ధమాదనే | మానసే కుముదా నామ విశ్వా విశ్వేశ్వరే విదుః. 27

మా నామ విశ్వకాయాం తు ఇచ్ఛాయాం మదనోత్కటా | గోమన్తే గోమతీ నామ మన్దారే కామచారిణీ. 28

మదోత్కటా చిత్రరథే జయన్తీ హస్తినాపురే | కన్యాకుబ్జే తథా గౌరీ రమ్భా మలయపర్వతే. 29

నన్దా హిమవతః పృష్ఠే గోకర్ణే భద్రకర్ణికా | స్థాణ్వీశ్వరే భవానీతి బిల్వకే బిల్వపత్రికా. 30

శ్రీశైలీ మాధవీ నామ భద్రా భ##ద్రేశ్వరే తథా | జయా వరాహశైలే తు కమ్బళా కమలాలయే. 31

పుష్క రే పురుహూతేతి కేదారే మార్గదాయినీ | రుద్రకోట్యాం తు రుద్రాణీ కాళీ కాళఞ్జరే గిరౌ. 32

మహాలిఙ్గేతు కపిలా మకుటే మకుటేశ్వరీ | సాలగ్రామే మహాదేవీ శివలిఙ్గే శివప్రియా. 33

మాయాపుర్యాం కుమారీ తు స న్తతా లలితే తథా | ఉత్పలాక్షే సహస్రాక్షీ హిరణ్యాక్షీ మహోత్పలే. 34

గయాయాం మఙ్గళా నామ విపులా పురుషోత్తమే | విపాశాయా మమోఘాక్షీ పాటలా పుణ్డ్రవర్ధనే. 35

నారాయణీ సుపార్శ్వేతు త్రికూటే భద్రసున్దరీ | విపులే విపులా నామ కల్యాణీ మలయాచలే. 36

కోట్యక్షీ కోటి తీర్థే తు సుగన్దా మాగధే వనే | కుబ్జామ్ర కే త్రిసన్ధ్యా తు గఙ్గద్వారే రతిప్రియా. 37

శివకుణ్డ సునన్దా చ నన్దినీ దేవికాతటే | రుక్మిణీ ద్వారవత్యాం తు రాధా బృన్దావనే వనే. 38

దేవకీ మథురాయాం తు పాతాళే పరమేశ్వరీ | చిత్రకూటే తథా సీతా విన్ధ్యే విన్ధ్యనివాసినీ. 39

సహ్యాద్రా వేకవీరాతు హరిశ్చన్ద్రతు చన్ద్రకా | రమణా రామతీర్థేతు యమునాయాం మృగావతీ. 40

కరవీరే మహాలక్ష్మీ రుమాదేవీ వినాయకే | ఆరోగ్యా వైద్యనాధేతు మహాకాళే మ హేశ్వరీ. 41

అభయా శుక్లతీర్థే తు స్మృతిర్వా విన్ధ్యకన్దరే | మాణ్డవ్యే మాణ్డకీనామ స్వాహా మా హేశ్వరే పురే. 42

ఛాగలాణ్డ ప్రచణ్డాచ చణ్డికా7మరకణ్టకే | సోమేశ్వరే వరారోహా ప్రభాసే పుష్కరావతీ. 43

దేవమాతా సరస్వత్యాం పారావారతటే మతా | మహాలయే మహాభాగా పయోష్టే పిఙ్గళావతీ. 44

సింహికా కృతశౌచే తు కార్తికేయే *యశస్కరీ | ఉత్పలావర్తకే లోలా సుబద్రా సిన్ధుసఙ్గమే. 45

మాతా సిద్దవనే లక్ష్మీ రనఙ్గా భరతాశ్రమే | జాలన్ధరే విశ్వముఖీ తారా కిష్కిన్ధపర్వతే. 46

దేవదారువనే పుష్టి ర్మేధా కాశ్మీరమణ్డలే | ¨ఉమాదేవీ మిమాద్రౌ తు షష్ఠే వస్త్రేశ్వరీ తథా. 47

కపాలమోచనే శుద్ధి ర్మాతా కాయావరోహణ | శఙ్ఖద్వారే ధ్వనిర్నామ భృతిః పిణ్డార కే తథా. 48

కలాతు చన్ద్రభాగాయా మచ్ఛోదే శూలధారిణీ | వైణాయా మమృతా నామ బదర్యా మూర్వశీ తథా. 49

ఓషధీ చోత్తరకురౌ కుశద్వీపేకుశోదకీ | మన్మథా హేమకూటే తు కుముదే సత్యవాదినీ. 50

అశ్వత్థే వన్దనీయాతు (ని) విధి ర్వైశ్రవణాలయే | గాయత్రీ వేదవదనే పార్వతీ శివసన్నిధౌ. 51

దేవలోకే తథేన్ద్రాణీ బ్రహ్మీంగేతు సరస్వతీ | సూర్యబిమ్బే ప్రభానా మ మాతౄణాం వైష్టవీ తథా. 52

అరున్ధతీ సతీనాంతు రామాసుచ తిలో త్తమా | చిత్తే బ్రహ్మకలా నామ శక్తి స్సర్వశరీరిణామ్‌. 53

దక్షునకు శ్రీ దేవి తన అష్టోత్తర శతస్థానములను తెలుపుట

1. వారాణసియందు విశాలాక్షి-2. నైమిశమున లింగధారిణి-3. ప్రయాగయందు శ్రీలలితాదేవి-4. గంధ మాదన (పర్వత)మున కాముక-5. మానససరః క్షేత్రమున కుముద-6. విశ్వేశ్వరమున విశ్వ-7. విశ్వకయందు మా (లక్ష్మీ)-8. ఇచ్ఛా క్షేత్రమున మదనోత్కట-9. గోమంతమున గోమతి-10. మందారమున కామచారిణి-11. చిత్రరథమున మదోత్కట-12. హస్తినాపురమున జయంతి-13. కాన్యకుబ్జమున గౌరి-14. మలయపర్వతమున రంభ-15. హిమవత్పర్వత సానువునందు నంద-16. గోకర్ణమున భద్రకర్ణిక-17. స్థాణ్వీశ్వరమున భవాని-18. బిల్వకమున బిల్వపత్రిక-19. శ్రీశైలమున మాధవి-20. భ##ద్రేశ్వరమున భద్ర-21. వరాహశైలమున జయ-22. కమలాలయమున కంబళ-23. పుష్కరక్షేత్రమున పురుహూత-24. కేదార క్షేత్రమున మార్గదాయిని-25. రుద్రకోటియందు రుద్రాణి-26. కాలంజర పర్వతమున కాళి-27. మహాలింగక్షేత్రమున కపిల-28. మకుట క్షేత్రమున మకుట-29. సాలగ్రామక్షేత్రమున మహాదేవి-30. శివలింగక్షేత్రమున శివప్రియ-31. మాయాపురి (జగన్నా ధక్షేత్రము) యందు కుమారి-32. లలితమునందు సంతత-33. ఉత్పలాక్షమున సహస్రాక్షి-34. మహోత్పలమున హిరణ్యాక్షి-35. గయయందు మంగళ-36. పురుషోత్తమమున విపుల-37. విపాశా నదీక్షేత్రమున అమోఘాక్షీ-38. పుండ్రవర్ధనమున పాటల-39. సుపార్శ్వమున నారాయణి-40. త్రికూట (పర్వత)మున భద్రసుందరి-41. వివులక్షేత్రమున విపుల-42. మలయాచలమున కల్యాణి-43. కోటి తీర్థమున కోట్యక్షి-44. మాగధవనమున సుగంధ-45. కుబ్జామ్రక క్షేత్రమున త్రిసంద్య-46. గంగాద్వారము (హరిద్వారమున రతిప్రియ-47. శివకుడ తీర్థమున సునంద-48. దేవికానదీతటమున నందిన-49. ద్వారకయందు రుక్మిణి-50. బృందా వనమున రాధ-51. మథురయందు దేవకి-52. పాతాళమున పరమేశ్వరి-53. చిత్రకూటమున సీత-54. వింధ్యమున వింధ్యవాసిని-55. సహ్యపర్వతమున (పడమటి కనుమలు) ఏకవీర-56. హరిశ్చంద్రమున చంద్రిక-57. రామతీర్థమున రమణ-58. యమునాతీరమున మృగావతి-59. కరవీరమున మహాలక్ష్మి-60. వినాయకమున ఉమ-61. వైద్యనాథమున ఆరోగ్య-62. మహాకాళమున మహేశ్వరి-63. శుక్లతీర్థమున అభయ-64. వింధ్య కందరమున స్మృతి-65. మాండవ్యమున మాండకి-66. మహేశ్వరపురమున స్వాహా-67. ఛాగలాండమున ప్రచండ-68. అమరకంటకమున చండిక-69. సోమే శ్వరమున వరారోహ-70. ప్రభాసమున పుష్కరావతి-71. సముద్రతీరమునందు సరస్వతీతీరమున దేవమాత-72. మహాలయమున మహాభాగ-73. పయోష్ణమున పింగళవతి-74. కృతశౌచ క్షేత్రమున సింహిక-75. కార్తికేయ క్షేత్రమున యశస్కరి-76. ఉత్పలావర్తకమున లోల-77. సాగర సంగమమున సుభద్ర-78. సిద్ధవనమున లక్ష్మీమాత-79. భరతాశ్రమమున అనంగ-80. జాలంధరమున విశ్వముఖి-81. కిష్కింధ పర్వతమున తార-82. దేవదారువనమున పుష్టి-83. కాశ్మీరమండలమున మేధ-84. హిమాద్రియందు ఉమాదేవి-85. షష్ఠక్షేత్రమున వస్త్రేశ్వరి-86. కపాలమోచనమున శుద్ధి-87. కాయావరోహణమున మాత-88. శంఖద్వారమున ధ్వని-89. పిండారకమున భృతి-90. చంద్రభాగాతీరమున కల-91. అచ్ఛోదమున శూలధారిణి-92. వైణాక్షేత్రమున అమృత-93. బదరీక్షేత్రమున ఊర్వశి-94. ఉత్తకురువులందు ఓషధి-95. కుశద్వీపమునందు కుశోదకి-96. హేమకూటమున మన్మథ-97. కుముదమున సత్యవాదిని-98. అశ్వత్థమున వందనీయ-99. వైశ్రవణాలయమున(ని)విధి-100. వేదవదనమున గాయత్రి-101. శివసంనిధియందు పార్వతి-102. దేవలోకమునందు ఇంద్రాణి 103. బ్రమ్మశరీరమున సరస్వతి-104. సూర్యబింబమునందు ప్రభ-105 సప్తమాతృకలయందు వైఫ్ణవి-106. పతివ్రతలయందు అరుంధతి-107. సుందరులగు స్త్రీలయందు తిలోత్తమ-108 సర్వప్రాణుల చిత్తములందును బ్రహ్మకలయను శక్తి.

ఏతదుద్దేశతః ప్రోక్తం నామాష్టశత ముత్తమమ్‌ | అష్టోత్తరంచ తీర్థానాం శతమేత దుదామృతమ్‌. 54

యస్స్మరే చ్ఛృణుయాద్వాపి సర్వపాపైః ప్రముచ్యతే | ఏషు తీర్థేషు యః కృత్వాస్నానం పశ్యతి మాంనరః.

సర్వపాపవినిర్ముక్తః కల్పం శివపురే వసేత్‌ | యస్తు మత్పరమః కాలం నయ త్యేతేషు మానవః. 56

స హిత్వా బ్రహ్మసదనం పద మభ్యేతి శాఙ్కరమ్‌ | మన్నామాష్టశతం యస్తు శ్రావయే చ్ఛిపనన్నిధౌ. 57

తృతీయాయా మథాష్టమ్యాం బహుపుత్త్రో భ##వే న్నరః | గోదానే శ్రాద్ధదానే వా అహన్యహని వా పునః. 58

దేవతార్చావిధౌ విద్వా న్పఠ న్ర్బహ్మాధిగచ్ఛతి | సూతః: ఏవం వదన్తీ సా తత్ర దదాహాత్మాన మాత్మనా. 59

స్వాయమ్భవోపి కాలేన దక్షః ప్రాచేతసో7భవత్‌ | పార్వతీ చాభవద్దేవీ శివదేహార్ధధారిణీ. 60

మేనాగర్భసముత్పన్నా భు క్తిము క్తిఫలప్రదా | అరున్ధతీ జప న్త్యేత దవాప్తా యోగముత్తమమ్‌. 61

పురూరవాశ్చ రాజర్షి ర్లోకానిష్టా నగాత్పరా9 | యయాతిః పుత్త్రలాభం చ ధనలాభంచ బార్గవః. 62

తథాన్యే దేవదైత్యాశ్చ బ్రాహ్మణాః క్షత్రియా స్తథా |వైశ్యాశ్శూద్రాశ్చ బహవ స్మ్సృత్వా సిద్ధిం యథేప్సితమ్‌.

యత్రైత ల్లిఖితం తిష్టే త్పూజ్యతే దేవసన్నిదౌ | న తత్ర శోకో దౌర్గత్యం కదాచిదపి జాయతే. 64

ఇతి శ్రీ మపత్స్యమమాపురాణ మత్స్యమనుసంవాదే గౌరీనామాష్టోత్తర

శతకథనం నామ త్రయోదశో7ధ్యాయః.

ఇట్లు ఇచ్చట శ్రీదేవి నామములను నూట ఎనిమిదింటిని పేర్కొనుట మాత్రము (వాటి అర్థములతో శ్రీదేవీ తత్త్వమును వివరించకయే) ఐనది. ఈ పేర్కొన్న నూట ఎనిమిది తీర్థక్షేత్రములను విన్నను స్మరించినను సర్వపాపములనుండి ముక్తి లభించును ఈ తీర్థములయందు స్నానముచేసి నన్ను దర్శించినవారు సర్వపాపముక్తులై కల్పమంతకాలమును శివపురమున వసింతురు. నాయందు తత్పరత కలిగి ఈ క్షేత్రములందు నివసించువారు బ్రమ్మలోకమును గూడ దాటి శి లోకమును చేరుదురు శుక్లపక్షమున తృతీయయందుగాని అష్టమినాడుగాని శివ సన్ని ధియందు నా ఈ అష్టోత్తర శత నామములను వినిపించినవారు బహుపుత్త్రవంతులగుదురు. గోదాన శ్రాద్ధ దాన కాలములందుగాని అను దినముననుగాని దేవతార్చనా సమయమునగాని దీనిని పఠించు వివేకులు బ్రహ్మపదమును పొందుదురు.

ఇట్లు పలుకుచునే శ్రీ సతీదేవి తన దేహమును స్వయముగా దహించుకొనెను. (చిత్స్వరూపగా అయ్యెను.)

మొదట స్వయం భూ బ్రహ్మయొక్క దక్షిణాంగుష్ఠమునుండి జనించి స్వాయంభువుడనబడిన ఈ దక్షుడే (తన కుమా ర్తెయగు సతీదేవి శాపముచే) ప్రచేతసులనబడు పదిమందికి కుమారుడుగా దక్షుడై (మరల) పుట్టెను. సతీ దేవియు పార్వతియై పుట్టి శివుని అర్ధాంగమునకు స్వామినియయ్యెను. ఈ రెండవ జన్మమున ఆమె మేన గర్భమున దుజనించి భుక్తి ము క్తి ఫలప్రదయైనది. అరుంధతి ఈ విషయమును (ఈ అష్టోత్తర శత మములను) జపించుచు ఉత్తమ యోగసిద్ధి పొందెను. రాజర్షియగు పురూరవుడును ఇష్టములును ఉత్తమములును అగు లోకములు పొందెను. భార్గవు (ని ఆలు)డు అగు యయాతియు పుత్త్రలాభమును ధనలాభమును పొందెను. ఇట్లే ఇతరులగు దేవతలును దైత్యులును బ్రాహ్మణ క్ష త్రియ వైశ్య శూద్రులును ఈ నామాష్టోత్తర శతకమును స్మరించి తమ ఇష్టముల సిద్ధింపజేసికొనిరి. ఇది వ్రాయబడియున్న చోటును దేవ సన్నిధిలో ఇది పఠింప-పూజింప-బడు చోటునను శోకముగాని దారిద్ర్యముగాని ఎన్నడును కలుగదు

ఇది శ్రీ మత్స్యమహా పురాణమున మత్స్యమను సంవాదమున

శ్రీ గౌరీనామాష్టోత్తర శత కథనమను త్రయోదశాధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters