Sri Matsya Mahapuranam-2
Chapters
ఏకోన త్రింశదుత్తర ద్విశతతమో7ధ్యాయః. రాజధర్మాః- దేవతా7ర్చావికారోపశాన్తిః. గర్గః : దేవతార్చాః ప్రనృత్యన్తి వేపన్తే ప్రజ్వలన్తిచ| ఆరటన్తి రుదన్త్యేతాః ప్రస్విద్యన్తి హాసమ్తిచ. 1 ఉత్తిష్ఠన్తి విషీదన్తి ప్రదావన్తి ధమన్తిచ | భజ్యన్తే విక్షిపంతేచ శ##స్త్రేమ ప్రహరన్తిచ. 2 అధోముఖాశ్చ తిష్ఠన్తి స్థానాత్ స్థానం చలన్తిచ| వమన్త్యగ్నిం తథా ధూమం స్నేహం రక్తం తథా వసామ్. 3 ఏవ మద్యాశ్చ దృశ్యన్తే వికారా స్సహసోత్థితాః| లిఙ్గాయతనవిప్రేషు తత్ర వాసం న రోచయేత్. 4 రాజ్ఞో వా వ్యసనం తత్ర స చ దేశో వినశ్యతి| దేవయాత్రాసు చోత్పాతా న్దృష్ట్వా దేశభయం వదేత్. 5 పితామహస్య హర్మ్యేషు తత్ర వాసం న రోచయేత్| పశూనాం రుద్రజం జ్ఞేయం నృపాణాం లోకపాజలమ్. 6 జ్ఞేయం సేనాపతీనాం తు యత్స్యా త్స్కన్దవిశాఖజమ్| లోకానాం విష్ణుసమ్భూతం విశ్వకర్మ సముద్భవమ్. 7 వినాయకోద్భవం జ్ఞేయం గణానాం యే తు నాయకాః| దేవప్రేష్యా న్నృపప్రేష్యా దేవస్త్రీ భి న్నృపస్త్రియః. 8 వాస్తు దేవోద్భవం జ్ఞేయం గ్రహాణామివ నాన్యథా| దేవతానాం వికారేషు శ్రుతివేత్తా పురోహితః. 9 దేవతార్చానాం తు గన్ధాద్యై స్స్నాన మాచ్ఛాద్య భూషయేత్| పూజయేచ్ఛ మహాభాగ గన్ధమాల్యాన్న సమ్పదా. 10 మధుపర్కేణ విధివ దుపతిష్ఠే దనన్తరమ్| తల్లిఙ్గేన చ మన్త్రేణ స్థాలీపాకం యథావిధి. 11 పురోధా జుహుయా ద్వహ్నౌ సప్తరాత్ర మతన్ద్రితః| విప్రాశ్చ పూజ్యా మధునా7 న్న పానై స్సదక్షిణం సప్తదినం నరేన్ద్ర. 12 ప్రాప్తే7ష్ట మే7 హ్ని క్షితిగోప్రదానై స్సకాఞ్చనై శ్శాన్తి ముపైతి పాపమ్. 12u ఇతి శ్రీ మత్స్య మహాపురాణ అర్చావికారోపశమనం నామ ఏకోన త్రింశదుత్తర ద్విశతతమో7 ధ్యాయః. రెండు వందల ఇరువది తొమ్మిదవ అధ్యాయము. దేవతార్చా వికారోపశాంతి. గర్గుడు అత్రితో ఇట్లు చెప్పెను: దేవాలయములందలి అర్చామూర్తులు (దేవతా విగ్రహములు) విశేషముగా నృత్యము చేయును; వణకును; ప్రజ్వలించును; గట్టిగా అరచును; ఏడుచును; చెమర్చును; నవ్వును; లేచును; దుఃఖించును ;పరుగెత్తును ;ఊదును; విరుగును ;కదలును ;అయుధములతో కొట్టును; తలలు వంచుకొని నిలుచును ;ఒక చోటి నుండు మరియొక చోటికి కదలును ;అగ్నిని పొగను నూనెను(జిడ్డును) రక్తమును వసను క్రక్కు ; ఈ విధములగు వికారములు దేవాలయములందో బ్రాహ్మణుల ఇండ్లయందో కనబడును; అట్టి చోటులందు నివాసము విడువలయును ; వీనిచే రాజునకయినను వ్యసనము (ఆపద) కలుగును- దేశమునకైన నాశము కలుగును ;ఇట్టి ఉత్పాతములు దేవతల జాతర లందు కనబడుచో దేశమునకు భయము కలుగును ;అభయములు హర్మ్యములందు బ్రహ్మవలనను పశువులకు రుద్రుని వలనను నృపులకు లోకపాలుర వలనను సేనాపతులకు స్కందునివలనను విశాఖుని వలనను ( ఈ ఇద్దరును కుమార స్వామి రూపభేదములే) లోక (రాజ్య)) జనులకు విశ్వకర్మ విష్ణువుల వలనను గణ నాయకులకు వినాయకుని వలనను రాజ సేవకులకు దేవసేలకుల వలనను నృపస్త్రీలకు దేవతా స్త్రీల వలనను ఆ పదలు ఈ ఉత్పాతములు ఫలముగా కలుగును; గ్రహాదులయందు కలుగు ఉత్పాత దర్శనములు వాసుదేవుని వలన కలుగును ;దేవతార్చామూర్తులందు ఈ వికారములు కనబడినపుడు వేదవేత్తయగు పురోహితుడు ఆ మూర్తి ని స్నానమాడించి వస్త్ర గంధ భూషణాదులతో కప్పివేయవలెను ;అలంకరించవలెను;గంధమాల్యాన్నాది సంపదలతో అర్చన చేయవలెను ;తరువాత మధువర్కముతో (తేనెతో కలిపిన గోక్షీరముతో) మూర్తిని సేవించవలెను ;ఆ దేవతా సంబంధి మంత్రములతో యథావిధిగ స్థాలీపాకము జరిపి ఆచరువుతో ఏడహోరాత్రములు హెచ్చరికతో హోమము చేయవలెను; ఈ ఏడు దినములును విప్రులను- తేనె అన్నపానములు దక్షిణలు- వీనితో పూజించవలెను ;ఎనిమిది దినమున విప్రులకు గోభూదానములు జరుపవలయును ;దీనిచే ఉపద్రవములు శాంతించును. ఇది శ్రీ మత్స్య మహపురాణమున రాజధర్మ మున అర్చావికారోప శమనమను éరెండు వందల ఇరువది తొమ్మిదవ అధ్యాయము.