Brahmapuranamu    Chapters   

అథఏకత్రింశదధికద్విశతతమో7ధ్యాయః

వ్యాసమునిసంవాదే ద్వాపరయుగాంతకథనమ్‌

మునయ ఊచుః

ఆసన్నం విప్రకృష్టం వా యది కాలం న విద్మహే | తతో ద్వాపరవిధ్వంసం యుగాంతం స్పృహయామహే || 1

ప్రాప్తా వయం హి తత్కాల మనయా ధర్మతృష్ణయా | ఆదద్యా మపరంధర్మం సుఖమల్పేన కర్మణా || 2

సంత్రాసోద్వేగజననం యుగాంతం సమువస్థితమ్‌ | ప్రనష్టధర్మం ధర్మజ్ఞ నిమిత్తై ర్వక్తు మర్హసి || 3

భవిష్యకథనము

ఓ వ్యాసమహామునీ! ప్రళయకాలము దగ్గరలో నున్నదో దూరములోనున్నదో మాకు తెలియదు. కనుక ఎప్పుడు ద్వాపరయుగము అంతమై కలియుగము ఆరంభమగునో ప్రళయము ఎప్పుడు వచ్చునో గుర్తించు విధము తెలిసికొన గోరి ఇటకు వచ్చితిమి. అల్పమగు ధర్మానుష్ఠానముతోనే అధికమగు ధర్మఫలము లభించు విధమును ధర్మము నాశము నొందుటచే మహాభయంకరమగు ప్రళయసమయమును గుర్తించు విధమును ఓ మునీ! మాకు తెలుపుము.

వ్యాస ఉవాచ

అరక్షితారో హర్తారో బలిభాగస్య పార్థవాః | యుగాంతే ప్రభవిష్యంతి స్వరక్షణపరాయణాః || 4

అక్షత్రియాశ్చ రాజానో విప్రాః శూద్రోపజీవినః | శూద్రాశ్చ బ్రాహ్మణాచారా భవిష్యంతి యుగక్షయే || 5

శ్రోత్రియాః కాండపృష్ఠాశ్చ నిష్కర్మాణి హవీంషి చ | ఏకపంక్త్యా మశిష్యంతి యుగాంతే మునిసత్తమాః || 6

అశిష్టవంతోర్థపరా నరా మద్యామిషప్రియాః | మిత్రభార్యాం భజిష్యంతి యుగాంతే పురుషాధమాః || 7

రాజవృత్తిస్థితా శ్చౌరా రాజానశ్చౌరశీలినః | భృత్యా హ్య నిర్దిష్టభుజో భవిష్యంతి యుగక్షయే || 8

ధనాని శ్లాఘనీయాని పతాం వృత్త మపూజితమ్‌ | అతుత్సనా చ పతితే భవిష్యంతి యుగక్షయే || 9

ప్రనష్టనాసాః పురుషా ముక్తకేశా విరూపిణః | ఊనషోడశవర్షాశ్చ ప్రసోష్యంతి తథాస్త్రియః || 10

అట్టశూలా జనపదాః శివశూలా శ్చతుష్పథాః | ప్రమదాః కేశశూలాశ్చ భవిష్యంతి యుగక్షయే || 11

సర్వేబ్రహ్మ వదిష్యంతి ద్విజా వాజసనేయికాః | శూద్రాభా వాదినశ్చైవ బ్రాహ్మణా శ్చాంత్యవాసినః || 12

శుక్లదంతా జితాక్షాశ్చముండాః కాపాయవాసనః | శూద్రా ధర్మం పదిష్యంతి శాఠ్యబుద్ధ్యోపజీవినః || 13

శ్వాపద ప్రచురత్వం చ గవాం చైవ పరిక్షయః | సాధూనాం పరివృత్తిశ్చ విద్యా దంతగతే యుగే ||14

అంత్యా మధ్యే నివత్స్యంతి మధ్యాశ్చాంత్యనివాసినః | నిర్హ్రీకాశ్చ ప్రజాః సర్వా నష్టా స్త్ర యుగక్షయే || 15

తపోయజ్ఞ ఫలానాం చ విక్రేతారో ద్విజోత్తమాః | ఋతవో విపరీతాశ్చ భవిష్యంతి యుగక్షయే || 16

తథా ద్విహాయనా దమ్యాః కలౌ లాంగలధారిణః | చిత్రవర్షీ చ వర్జన్యో యుగే క్షీణ భవిష్యతి || 17

యుగాంతకాలమున రాజులు ప్రజలను రక్షింపకయే పన్నులు గ్రహించుచు తమ్ముతాము రక్షించుకొనుట యందాసక్తి కలిగియుందురు. క్షత్రియులు కానివారు రాజులగుదురు. బ్రాహ్మణులు శూద్రుల సేవించి జీవింతురు. శూద్రులు బ్రాహ్మణుల ఆచారములను పాటింతురు. వేదపండితులు కాండపృష్ఠులు- వేదములను నిరర్థకముగా మోయువారు - అగుదురు. కర్మానుష్ఠానము సరిగా చేయకయే హవిస్సును అగ్నిలో వేల్చెదరు. అన్నికులములవారును ఒకే పంక్తితో భుజింతురు. జనులు శిష్టాచారములులేక ధనము ముఖ్యమని భావించుచు మద్యమాంసములయందు ప్రీతికల వారగుదురు. నరాధములై మిత్రుల భార్యలననుభవింతురు. దొంగలురాజులవెను రాజులుదొంగలవలెను ప్రవర్తింతురు. భృత్యులు తమకు అర్హము కాని దానిని అనుభవింతురు. ధనములకు గౌరవముకలుగును. సత్ర్పవర్తనకు ఆదరము కలుగదు. భ్రష్టుడైనవానిని ఎవరును నిందింపక మెచ్చుకొందురు. పురుషులు వివేకహీనులు జుట్టు ముడివేసికొనక విడిచినవారు విరూపులు అగుదురు. పదానాఱండ్లలోపు స్త్రీలకే కాన్పుఅగును. జనపదములలో అన్నము అమ్మబడును. నడి వీథులలో వేదము విక్రయించబడును. స్త్రీలును మానమును అమ్ముకొందురు. బ్రాహ్మణులు అంత్యజులగు వారితో కలిసి వసించుచు శూద్రులవలె మాటలాడుచుందురు. శూద్రులు తెల్లనిదంతములు కలవారు - ఇంద్రియముల జయించినవారునై తలలు బోడిగా చేసికొని కాషాయవస్త్రములు ధరించి కపటధూర్తబుద్ధితో జీవించుచు ధర్మము ప్రవచింతురు. కుక్కలు ఎక్కువగును. గోవులుతగ్గును. సాధువులును తగ్గిపోవుదురు. గ్రామాంతరములయందు నివసింపవలసిన వారు గ్రామమధ్యమునను. గ్రామమధ్యమున మధ్యనుండవలసినవారు గ్రామాంతమున నివసింతురు. జనులు అందరు సిగ్గులేని వారయి తత్ఫలముగా నశింతురు. బ్రాహ్మణులు తపోయజ్ఞఫలమ్ముకొందురు. ఋతుధర్మములు తారుమారగును. రెండేండ్ల గిత్తలచే నాగళ్ళులాగింతురు. వానలు క్రమము ననుసరించి కురియకుండును.

సర్వే శూరకూలే జాతాః క్షమానాథా భవంతి హి | యథానామ్నాః ప్రజాః సర్వా భవిష్యంతి యుగక్షయే || 18

పితృదేయాని దత్తాని భవిష్యంతి తథా సుతాః | న చ ధర్మ చరిష్యంతి మానవా నిర్గతే యుగే || 19

ఊషరా బహూశా భూమిః పంథాన స్తస్కరావృతాః | సర్వే వాణికాశ్చైవ భవిష్యంతి యుగక్ష యే || 20

పితృదాయా న్యదత్తాని విభజంతి తథా సుతాః | హరణ యత్నవంతోపి లోభాదిభి ర్విరోధినః || 21

సౌకుమార్యే తథారూపే రత్నే చో పక్షయంగతే | భవిష్యంతి యుగస్యాంతే నార్యః కేశైరలంకృతాం || 22

నిర్వీర్యస్య రతిస్తత్ర గృహస్థస్య భవిష్యతి | యుగాంతే సమనుప్రాప్తే నాన్యా భార్యాసమా రతిః || 23

కుశీలానార్యభూయిష్ఠా వృథారూపసమన్వితాః | పురుషాల్పం బహుస్త్రీకం త ద్యుగాంతస్య లక్షణమ్‌ || 24

బహూయాచనకో లోకో స దాస్యతి పరస్పరమ్‌ | రాజాచౌరాగ్ని దండాది క్షీణః క్షయ ముపైష్యతి || 25

అఫలాని చ సస్యాని తరుణా వృద్ధశీలినః | అశీలాః సుఖినో లోకే భవిష్యంతి యుగక్షయే || 26

వర్షాసు పరుషా వాతా నీచాః శర్కర వర్షిణః | సందిగ్ధః పరలోక శ్చ భవిష్యతి యుగక్షయే || 27

వైశ్యా ఇవ చ రాజన్యా ధన ధన్యోప జీవినః | యుగాపక్రమణ పూర్వం భవిష్యంతి న బాంధవాః || 28

అప్రవృత్తాః ప్రణశ్యంతి సమయాః శపథా స్తథా | ఋణం సవినయ భ్రంశం యుగే క్షీణ భవిష్యతి || 29

భవిష్య త్యఫలో హర్హః క్రోధ శ్చ సఫలో నృణామ్‌ | అజా శ్చాపి నిరోత్స్యంతి వయసోర్ధే యుగక్షయే || 30

అశాస్త్ర విహితో యజ్ఞ ఏవ మేవ భవిష్యతి | అప్రమాణం కరిష్యంతి నరాః పండిత మానినః || 31

శాస్త్రోక్త స్యాప్ర వక్తారో భవిష్యంతి స సంశయః | సర్వః సర్వం విజానాతి వృద్ధా ననుపనేవ్య వై || 32

న కశ్చి దకవి ర్నామ యుగాంతే సమువస్థితే | నక్షత్రాణి వియోగాని న కర్మస్థా ద్విజాతయః || 33

చౌరప్రాయా శ్చ రాజానో యుగాంతే సమువస్థితే | కుండీవృషా నైకృతికాః సురాపా బ్రహ్మవాదినః || 34

అశ్వమేధేన యక్ష్యంతే యుగాంతే ద్విజసత్తమాః | యాజయిష్యం త్యయాజ్యాం స్తు తథాభక్ష్యస్య భక్షిణః || 35

బ్రాహ్మణా ధనతృష్ణార్తా యుగాంతే సముపస్థితే | భోఃశబ్ద మభిధాస్యంతి స చ కశ్చి త్పఠిష్యతి || 36

ఏకశంఖా స్తథా నార్యో గవేధుక పినద్ధకాః | నక్షత్రాణి వివర్ణాని విపరీతా దిశో దశ || 37

సంధ్యారాగో విదగ్ధాంగో భవిష్యతి యుగక్షయే | ప్రేషయంతి పితౄ న్పుత్రా వధూః శ్వశ్రూః స్వకర్మసు || 38

యుగే ష్వేవం నివత్స్యంతి ప్రమదాశ్చ నరా స్తథా | అకృత్వాగ్రాణి భోక్ష్యంతి ద్విజాశ్చైవాహుతాగ్నయః || 39

భిక్షాం బలి మదత్త్వా చ భోక్ష్యంతి పురుషాః స్వయమ్‌ | వంచయిత్వా పతీ న్సుప్తా న్గమిష్యంతి స్త్రియో 7 న్యతః || 40

వ వ్యాధితా న్నాప్యరూపా న్గ్నోద్యతా న్నాప్యసూయకాన్‌ | కృతే న ప్రతికార్త చ యుగే క్షీణ భవిష్యతి || 41

దొంగలవంశములలో పుట్టినవారందరును ప్రభువులగుదురు. దానికి తగినవారుగానే ప్రజలునుందురు. తండ్రులకు ఈయదగినవి అన్నియు ఇతరులకు ఈయబడును. కుమారులు గాని ఇతర మానవులుగాని తాముతాము ఆచరించవలసిన ధర్మములను ఆచరింపరు. భూమి ఎక్కువ చవిటినేలయగును. త్రోవలు అన్నియు దొంగలతో నిండిపోవును. తండ్రినుండి దాయభాగముగా వచ్చిన ఆస్తిని కుమారులు పంచుకొనుటలో లోభముతో నిండినవారై పరస్పరము కలహించుకొనుచు తామే ఎక్కువ హరించుకొనవలెనను ప్రయత్నముతో కూడినవారై యుందురు. స్త్రీలు తమ సౌకుమార్యము రూపము నశించిపోగా కేశములతో మాత్రమే అలంకారము చేసికొందురు. పురుషుడు నిర్వీర్యుడై యుండియు అట్టి భార్యలతో సుఖింతురు. భార్యతో సుఖించుటయే పరమసుఖముగా భావింతురు. జనులు చాలభాగము దుఃశీలము కలవారు అనార్యులు ఐయుందురు. నిరుపయోగముగా రూపసౌందర్యముల పోషించుకొందురు. పురుషులు తగ్గిపోవుదురు. స్త్రీలసంఖ్య అధికమగును. పైరులలో పంటతక్కువగును. యాచకు లెక్కువగుదురు. ఒకరికొకరు ఇచ్చుకొనుట ఉండదు. రాజదండనము చోరపీడలవలన బాధనొంది జనులు నశింతురు. యువకులుకూడ వృద్ధులవలె అలవాటులు కలవారుగా నుందురు. శీలములేనివారు సుఖింతురు. వర్షాకాలమందును పరుషమైన గాలులు ఇసుకను వర్షించు చుండును. పరలోకము లేదా ఉన్నదా అని సందేహింతురు. క్షత్త్రియులును వైశ్యులవలె ధనధాన్యములపై అధారపడి జీవింతురు. బంధుప్రీతి తగ్గిపోవును. ఒడంబడికలు శపథములు పనిచేయక నశించును. ఋణము తీర్చు విషయములో సద్వ్యవహారముండదు. సంతోషము నిష్ఫలమై క్రోధము సఫలమగును. అనగా కోపముచేసిన వారికి మనుష్యుల భయపడుదురే కాని నిదానముగా చెప్పినమాట వినరు. పాడికే మేకలను గొర్రెలను కట్టివేసికొందురు. యజ్ఞములు శాస్త్రవిధానము ననుసరింపక యే జరుగుచుండును. నరులు ఎవరికివారు తామే పండితులమనుకొనుచు శాస్త్రప్రమాణములతో పనిలేక అయా కార్యములాచరింతురు. శాస్త్రవిషయములను ప్రవచించువారుండరు. పెద్దలను సేవించి విషయములను తెలిసికొనకయే తనకు విషయము తెలిసెననును. ప్రతివాడునుకవియే. నక్షత్రములు సరియైనయోగములతో నుండవు. బ్రాహ్మణులు తమ ధర్మకర్మములను సరిగా ఆచరింపరు. రాజులు దొంగలవంటి వారగుదురు. బ్రాహ్మణులు మోసగాండ్రు కల్లు త్రాగువారునగుదురు. అశ్వమేధయాగము చేయుదురు. యాగముచేయింపతగనివారిచే యజ్ఞములచేయింతురు. తినరానిదానిని తిందురు. ధనాశాపరులగుదురు. అందరును ''భోః'' అను శబ్దమును ఉచ్చరింతురేకాని ఒక్కడును అధ్యయనముచేయడు. స్త్రీలు గడ్డితో తలలుకప్పికొందురు. నక్షత్రములు కాంతి తగ్గును. దిక్కులు తారుమారగును. సాయంసంధ్యాకాలపు ఎఱుపు దిక్కులుమండుచున్నట్లు కనబడును. కుమారులు తండ్రులకును కోడళ్ళు అత్తలకును పనులు ఆజ్ఞాపింతురు. బ్రాహ్మణులు హోమములుచేయరు. ఏమియు ఇతరులకు మిగుల్చక అంతయు తామేతిందురు. నిద్రించుచున్న భర్తలను మోసగించి స్త్రీలు మఱియొకచోటికి పోవుదురు. స్త్రీలు రోగులుగాను రూపహీనులుగాను ప్రయత్న పరులుగాను తన తప్పులు గుర్తించు వారుగాను నుండు భర్తలనుపొందరు. ఉపకారికి ఎవరును ప్రత్యుపకారముకూడ చేయరు.

మునయ ఊచుః

ఏవం విలంబితేధర్మే మానుషాః కరపీడితాః | కుత్ర దేశే నివత్స్యంతి కి మాహారవిహారిణః || 42

కిం కర్మాణః కి మీహంతః కిం ప్రమాణాః కి మాయుషః |

కాం చ తాష్ఠాం సమాసాద్య ప్రపత్స్యంతి కృతం యుగమ్‌ || 43

ఇట్లు యుగాంతమున ధర్మములోపింపగా మనుష్యులు కష్టములుపొందుచు ఏ ఆహారవిహారములు కలిగి ఏ కర్మలాచరించుచు ఏ కోరికలుకోరుచు ఎంత ప్రమాణము (ఎత్తు కొలతలు) ఎంత ఆయువు కలవారై కాలము గడుపుచు మరల కృతయుగమును అందుకొందురు ? అని మునులు వ్యాసునడిగిరి.

వ్యాస ఉవాచ

ఆత ఊర్ధ్వం చ్యుతే ధర్మే గుణహీనాః ప్రజా స్తథా | శీలవ్యసన మాసాద్య ప్రాప్స్యంతి హ్రానమాయుషః || 44

ఆయుర్హాన్యా బలగ్నా నిర్బలగ్నాన్యా వివర్ణతా | వై వర్ణ్యా ద్వ్యాధి సంపీడా నిర్వేదో వ్యాధిపీఢనాత్‌ || 45

నిర్వేదా దాత్మ సంబోధః సంబోధా ద్ధర్మశీలతా | ఏవం గత్వా పరాం కాష్ఠాం ప్రపత్స్యంతి కృతం యుగమ్‌ || 46

ఉద్దేశతో ధర్మశీలాః కేచి న్మధ్యస్థతాం గతాం | కింధర్మశీలాః కేచి త్తు కేచి దత్ర కుతూహలాః || 47

ప్రత్యక్ష మనుమానం చ ప్రమాణ మితి నిశ్చితాః | అప్రమాణం కరిష్యంతి సర్వ మిత్యపరే జనాః || 48

నాస్తిక్యపరతా శ్చాపి కేచి ద్ధర్మవిరోపకాః | భవిష్యంతి సరా మూఢా ద్విజాః పండితమానినః | | 49

తదాత్వ మాత్ర శ్రద్ధేయాః శాస్త్ర జ్ఞాన బహిష్కృతాః | శుభా స్సమాచరిష్యంతి దానశీలపరాయణాః || 50

తథా విలులితే ధర్మే జనాః శ్రేష్ఠ పురస్కృతాః | శుభా స్పమాచరిష్యంతి దానశీలపరాయణాః || 51

సర్వభక్షాః స్వయంగుప్తా నిర్ఘ్రణా నిరపత్రపాః | భవిష్యంతి తదాలోకే త త్కమాయస్య లక్షణమ్‌ || 52

కషా మోపప్లవే కాలే జ్ఞాననిష్ఠా ప్రణాశ##నే | సిద్ధి మల్పేన కాలేన ప్రాప్స్యంతి నిరుపస్కృతాః || 53

విప్రాణాం శాశ్వతీం వృత్తిం యదా వర్ణవరే జనాః | సంశ్రయిష్యంతి భో విప్రా స్తత్కషాయస్య లక్షణమ్‌ || 54

మహాయుద్ధం మహావర్షం మహావాతం మహాతపః | భవిష్యతి యుగే క్షీణ త త్కషాయస్య లక్షణమ్‌ || 55

విప్రరూపేణ యక్షాంసి రాజానః కర్ణవేధినః | పృథివీ ముపభోక్ష్యంతి యుగాంతే సమువస్థితే || 56

నిఃస్వాద్యాయవషట్రారాః కునేతారో భిమానినః | క్రావ్యాదా బ్రహ్మరూపేణ సర్వభక్ష్యా వృథావ్రతాః || 57

మూరా శ్చార్థపరా లుబ్ధాః క్షుద్రాః క్షుద్ర పరిచ్ఛదాః | వ్యవహారోవవృత్తా శ్చ చ్యుతా చ్చ శాశ్వతాత్‌ || 58

హర్తారః పరరత్నానాం పరదారప్రధర్షకాః | కామాత్మానో దురాత్మానః సోపధాః ప్రియసాహసాః || 59

తేషు ప్రభవమానేషు జనే ష్వపి చ సర్వశః | అభావినో భవిష్యంతి మునయో బహూరూపిణః || 60

కలౌయుగే సముత్పన్నాః ప్రధానపురుషా శ్చ యే | కథాయోగేన తా న్సర్వా న్పూజయిష్యంతి మానవాః || 61

సస్య చౌరా భవిష్యంతి తథా చై లాపహారిణః | భోక్ష్య భోజ్యహరా శ్చైవ కరండానాం చ హారిణః || 62

చౌరాశ్చౌరస్య హర్తారో హంతా హంతు ర్భవిష్యతి | చౌరై శ్చౌరక్షయే చాపి కృతే క్షేమం భవిష్యతి || 63

నిఃసారే క్షుభితే కాలే నిష్క్రియే సంవ్యవస్థితే | నరా వనం శ్రయిష్యంతి కరభారప్రపీడితాః || 64

యజ్ఞకర్మ ణ్యుపరతే కక్షాంపి శ్వాపదాని చ | కీటమూషికనర్పాశ్చ ధర్షయిష్యంతి మానవాన్‌ || 65

క్షేమం సుభిక్ష మారోగ్యం సామగ్ర్యం చైప బంధుషు | ఉద్ధేశేషు నరాః శ్రేష్టా భవిష్యంతి యుగక్షయే || 66

స్వయంపాలాః స్వయం చౌరాః ప్లవసంభార సంభృతాః | మండలైః సంభవిష్యంతి దేశేదేశే పృథ క్పృథక్‌ || 67

స్వదేశేభ్యః పరిభ్రష్టా నిఃసారాః సహ బంధుభిః | నరాః సర్వే భవిష్యంతి తదా కాలపరిక్షయాత్‌ || 68

అటు మీదట క్రమముగా ధర్మము భ్రష్టమైపోగా ప్రజలు సద్గుణహీనులగుదురు. శీలము నశించును. ఆయువు క్షీణమగును. బలముతగ్గును. దానిచే దేహము వన్నె తఱుగును. దానిచే వ్యాధులబాధ కలుగును. దానిచే వైరాగ్యము కలుగును. దానిచే ఆత్మజ్ఞానసిద్ధికై ప్రయత్నించి దానిని పొంది మఱల జనుల ధర్మశీలురగుదురు. ఇట్లు మరల ఉన్నత స్థితికిపోయి పోయి కృతయుగ మును అందుకొనెదరు. అంతకులోగా మాత్రము కొందఱు నామమాత్రమునకు ధర్మ శీలముకలవారు - కొందఱు ధర్మము తెలిసియు పట్టించుకొనని తటస్థులు - కొందఱు అల్పముగా ధర్మశీలము కలవారు - కొందఱు వేడుకకు మాత్రము ధర్మమును అనుష్ఠించువారు - అగుదురు. ప్రత్యక్షముగా ఇంద్రియములకు గోచరించునదే ప్రమాణమని కొందఱు-అనుమానము-హేతువుచే నిర్ణయించినది-కూడ ప్రమాణమేయని మఱికొందరు ఏ ప్రమాణముతోను పనిలేదు మఱికొందరు వాదింతురు. నాస్తికత్వమును పూనువారు ధర్మమును లోపింపజేయువారు అగుదురు. బ్రాహ్మణులను తామే పండితులమను అహంకారముతో నుందురు. అప్పటికి పని జరుగువిషయములమీద మాత్రము శ్రద్ధకలవారై శాస్త్రజ్ఞానము లేక దాంభికులై పరమార్థత త్త్వజ్ఞానము లేకుందురు. ఇట్లు ధర్మము నశించగా జనులు మరల శ్రేష్ఠులగు పెద్దలను ముందుపెట్టుకొని దానగుణము సుశీలము కలవారై శుభము కలిగించు కర్మలను ఆచరింతురు. జనులు సిగ్గులేక సర్వము భక్షింతురు. తమకై అన్నియు దాచుకొందురు. నిర్దయులగుదురు. జ్ఞానము సాధించుటయందు నిష్ఠ ఉండదు. అట్టి స్థితిలో జ్ఞాననిష్ఠకలవారు మాత్రము అల్పకాల తపముతోనే సిద్ది పొందుదురు. యుగాంతమున తక్కువ కులములవారు బ్రాహ్మణుల ప్రవర్తనమును వహింతురు. మహాయుద్ధములు - మహావర్షములు-పెనుగాలులు-తీవ్రమగు ఎండలు సంభవించును. రాజులు కర్మవాదులు అయి భూమిని రాజ్యమును అనుభవింతురు. రాక్షసులు బ్రాహ్మణులై జన్మింతురు. వారు స్వాధ్యాయము పషట్కారములు మొదలగు యజ్ఞవాక్కులు లేక జనులను చెడుమార్గములలో నడపుచు దురభిమానులై సర్వము భక్షించునుచు వ్యర్థముగా కపటమునకుమాత్రము కర్మానుష్ఠానము చేయుదురు. వారు మూర్ఖులు ధనప్రధానులు లోభులు క్షుద్రులు క్షుద్రులను పరివారజనముగా పెట్టుకొనినవారు శాశ్వతమగు ధర్మమును వదలి లోకవ్యవహారమునకై పాటుపడువారు అగుదురు. పరధనముల హరింతురు. పరదారలను ఆశింతురు. కామముతో దురాత్ములై కపటులై సాహసము మీద ఇష్టము కలవారై ఉందురు. బ్రాహ్మణులు ఇట్లు కాగా మునులు అనేక లక్షణములతో ఉందురు. జనులలో జరుగరాని చెడుగులు జరుగును. ప్రధాన పురుషులుగా ఏర్పడిన వ్యక్తులను గూర్చిన కథలకు ప్రాముఖ్యమిచ్చి అట్టివారిని పూజించుచుందురు. జనులు పంటలు - పైరులు - వస్త్రములు భక్ష్యభోజ్యములు - వస్తువులు దాచుకొను డబ్బీలు దొంగిలిచువారగుదురు. దొంగల ధనము హరించు దొంగలు వధించువారిని కూడ వధించు క్రూరులు అగుదురు. ఇట్లు దొంగలు- ప్రాణివధ చేయువారు నశించిపోగా ప్రజలకు క్షేమము కలుగును. ఇట్లు లోకము నిఃసారమై క్షోభము చెందగా ఏమియు చేయలేక పన్నులబరువు మోయలేక జనులు అడవులకు పారిపోవుదురు. యజ్ఞకర్మలు లోపించుటచే జనులకు రాక్షసుల-క్రూరమృగముల - కీటమూషిక సర్పముల వలన భయమెక్కువగును. ప్రజలలో క్షేమము సుభిక్షము ఆరోగ్యము బంధుసమృద్ధి ఉండవలెనను ఉద్దేశము కలవారెవరైన నున్నచో అట్టివారు నరశ్రేష్ఠులని భావించవలసిన కాలము వచ్చును. ఇట్టి స్థితిలో జనులు నిఃసారులై తమవారితో కూడ స్వదేశములు విడిచిపోవుదురు.

తతః సర్వే సమాదాయ కుమారా న్ప్రద్రుతా భయాత్‌ | కౌశికీం సంతరిష్యంతి నరాః క్షుద్భయ పీడితాః || 69

అంగా న్వంగా న్కశింగాం శ్చ కాశ్మీరా వథ కోనలాన్‌ | ఋషికాంత గిరిద్రోణీః సంశ్రయిష్యంతి మానవాః || 70

కృత్స్నం చ హిమవ త్పార్శ్వం కూలం చ లవణాంభనః | వివిధం జీర్ణపత్రం చ వల్కలా వ్యజినానిచ || 71

స్వయం కృత్వా నివత్స్యంతి తస్మి న్భూతే యుగక్షయే | అరణ్యషు చ వత్స్యంతి నరా వ్లుెచ్ఛగణౖః సహ || 72

నైవ శూన్యా నవారణ్యా భవిష్యతి వసుంధరా | అగోప్తార శ్చ గోప్తారో భవిష్యంతి నరాధిపాః || 73

మృగై ర్మత్స్యై ర్విహంగై శ్చ శ్వాపదైః సర్పకీటకైః | మధుశాకఫలై ర్మూలై ర్వర్తయిష్యంతి మానవాః || 74

శీర్ణవర్నఫలాహారా వల్కలాన్యజినాని చ | స్వయం కృత్వా నివత్స్యంతి యథా మునిజన స్తథా || 75

బీజానా మకృతస్నేహా ఆహతాః కాష్ఠశంకుభిః | అజైణకం ఖరోష్ట్రం చ పాలయిష్యంతి నత్యశః || 76

నదీ స్రోతాంసి రోత్స్వంతి తోయార్థం కూలమాశ్రితాః | పక్వాన్నవ్యవహారేణ విపణంతః పరస్పరమ్‌ || 77

తనూరుహైర్యథాజాతైః సమలాంతరసంభృతైః | బహ్వపత్యాః ప్రజాహీనాః కులశీల వివర్జితాః || 78

ఏవం భవిష్యంతి తదా నరా శ్చాధర్మ జీవినః | హీనా హీనం తథా ధర్మం ప్రజా సమనువత్స్యతి || 79

అయు స్తత్ర చ మర్త్యానాం పరం త్రింశ ద్భవిష్యతి | దుర్బలా విషయగ్లానా జరాశోకై రభిప్లుతాః || 80

భవిష్యంతి తదా తేషాం రోగై రింద్రియ సంక్షయః | అయుఃప్రత్యయసంరోధా ద్విషయా దుపరంస్యతే || 81

శుశ్రూషవో భవిష్యంతి సాధూనాం దర్శనే రతాః | సత్యం చ ప్రతిపత్స్యంతి వ్యవహారోప సంక్షయాత్‌ || 82

భవిష్యంతి చ కామానా మలాభాద్ధర్మ శీలినః | కరిష్యంతి చ సంస్కారం స్వయం చ క్షయపీడితాః || 83

ఏవం శుశ్రూషవో దానే సత్యే ప్రాణ్యభిరక్షణ | తతః పాదప్రవృత్తే తు ధర్మే శ్రేయో నిపత్స్యతే || 84

తేషాం లబ్ధానుమానానాం గుణషు పరివర్తతామ్‌ | స్వాదు కింత్వితి విజ్ఞాయ ధర్మ ఏవ చ దృశ్యతే || 85

యథాహావిక్రమం ప్రాప్తా స్తథా బుద్ధిక్రమం గతాః | ప్రగృహీతే తతో ధర్మే ప్రపశ్యంతి కృతం యుగమ్‌ || 86

సాధువృత్తిః కృతయుగే కషాయే హాని రుచ్యతే | ఏక ఏవ తు కాలోయం హీనవర్ణో యథా శశీ || 87

ఛన్నశ్చ తమసా సోమో యథా కలియుగం తథా | ముక్తశ్చ తమసా సోమ ఏవం కృతయుగం చ తత్‌ || 88

అర్థవాదః పరం బ్రహ్మ వేదార్థ ఇతి తం విదుః | అవివిక్త మవిజ్ఞాతం దాయాద్య మిహ ధార్యతే || 89

ఇష్టవాద స్తపో నామ తపో హి స్థవిరీకృతః | గుణౖః కర్మాభినిర్వృత్తి ర్గుణాః శుధ్యంతి కర్మణా || 90

ఆశీస్తు పురుషం దృష్ట్వా దేశకాలానువర్తినీ | యుగే యుగే యథా కాల మృషిభిః సముదాహృతా || 91

ధర్మార్థకామమోక్షణాం దేవానాం చ ప్రతిక్రియా | ఆశిష శ్చ శివాః పుణ్యా స్తథైవా ೭೭యు ర్యుగే యుగే || 92

తథా యుగానాం పరివర్తనాని చిరప్రవృత్తాని విధిస్వభావాత్‌ |

క్షణం న సంతిష్ఠంతిచ జీవలోకః క్షయోదయాభ్యాం పరివర్తమానః || 93

ఇతి శ్రీమహాపురాణ ఆదిబ్రాహ్మే వ్యాసర్షిసంవాదే భవిష్యకథనం నామ ఏకత్రింశదధిక ద్విశతతమోధ్యాయః.

జనులంతట కుమారులను వెంట తీసికొని భయముతో పారిపోవుచు కౌశికీనదిని (హిమాలయ సమీపమున) దాటి ఆకలితో బాధపడుచు అంగవంగ కశింగ కాశ్మీర కోసల దేశములను కొండలోయలను హిమవత్పర్వత ప్రాంతమును సముద్రతీరమునంతటిని ఆశ్రయించి నివసించుచు తమకు తామే శ్రమించి సంపాదించుకొనిన ఎండుటాకులు తినుచు చర్మములు చెట్ల నారలు ధరించుచు జీవింతురు. భూమి శూన్యమునుకాక అడవియును కాక యుండును. ప్రభువులు ప్రజల రక్షంపని వారగుదురు. మానవులు మృగములను చేపలను పక్షులను క్రూరమృగములను పాములను పురుగులను తేనెను ఆకుకూరలను పండ్లను దుంపలను వేళ్ళను ఎండుటాకులను తిని జీవింతురు. తమవంశమువారిపై కూడ స్నేహభావము లేక కర్రలతో చేసిన శంకువులతో కొట్లాడుకొనుచు మేకలను గొర్రెలను గాడిదలను ఒంటెలను పశువులుగా పోషించుకొనుచుందురు. నదీతీరములను ఆశ్రయించి నివసించుచు నీటికై నదీజల ప్రవాహములను అడ్డుకట్టలతో అడ్డగింతురు. జుట్టు మొలచినది మొలిచినట్లు లోపల మురికితో నిండి పెరుగుచుండ అట్లే వదలుదురు. కొందఱికి సంతానము అధికము. కొందఱికి సంతానమే కలుగదు. కుల శీలములుండవు. వండిన ఆహారపదార్థములు అమ్ముచు కొనుచు వానితో వ్యాపారము చేయుదురు. ప్రజలు హీనులై హీనధర్మమును అనుసరింతురు. విషయసుఖములకు పాల్పడి దుర్బలులు రోగులునై ఇంద్రియములు క్షీణములై జరాశోకములచే బాధ నొందుదురు. ఆయువు తగ్గునని భయము కలుగగా చివరకు ఇంద్రియ సుఖములనుండి వెనుకకు మరలుదురు. లోక వ్యవహారము చేతకాకపోవుటచే వైరాగ్యము కలిగి సత్పురుషుల దర్శించి సేవించవలెనను కోరిక కలుగును. సత్యముపై శ్రద్ధ కలుగును. పెద్దల ఆజ్ఞను పాటించి సద్గుణముల వైపునకు మరలుటచేత ధర్మమే మంచిదని తోచి దానిననుష్ఠింతురు. కోరికలు తీరుటకు అవకాశము లేకపోవుటచే ధర్మశీలులుగుదురు సుఖక్షయముచే బాధనొంది చిత్తసంస్కారము సంపాదింతురు. ప్రాణులపై దయ కలుగును. ఇట్లు పాదపాదక్రమమున మరల ధర్మము వృద్ధియగుట కారంభమగును. ఇట్లు మరల జనులు కృత కృతయుగములోనిక వత్తురు. కాలము ఎప్పుడును ఒక్కటియే. కలియుగమున ధర్మక్షయము-కృతయుగమున ధర్మవృద్ధి-ఇదే భేదము. చంద్రుడొక్కడే రాహువు కప్పినచో మలినుడై-విడిచినపుడు ప్రకాశించునుకదా! కలియుగమున పరబ్రహ్మతత్త్వము అర్థవాదముగా పొగుడుటకు చెప్పిన గోప్పమాటగా - భావింతురు. కృతయుగములో ఆ పరబ్రహ్మమును వేదముచే తెలియదగిన వస్తువునుగా గ్రహింతురు. ఆ తత్త్వము కలిలో తెలియరానిదై వివేచింత రానిదై శత్రుభావముతో చూడబడును. కలిలో తపస్సు అనునది ఇష్ఠముతో వేడుకకు చేయుపనిగా ఉండును. కృతయుగములో అదే తపస్సు గౌరవించబడును. ఇదే రెంటికి భేదము. సద్గుణములున్నచో కర్మలనుష్ఠించగలరు. కర్మలు అనుష్ఠించినచో గుణములు సంస్కారమునొంది శుద్ధములగును. ఆయా యుగములందలి పురుషుని యోగ్యతను బట్టి దేశ కాలానుసారముగా వారివారి కోరికలును ఆచరణములు నుండునని ఋషులు చెప్పిరి. యుగయుగమునను పురుషుని యోగ్యతానుసారమే ధర్మార్ధ కామ మోక్షసాధనకై కర్మానుష్ఠానము దేవతల అనుగ్రహము శుభములు పుణ్యములు నగు కోరికలు జనులకు కలుగును. ఇట్లు యుగముల పరివర్తనములు విధి చేసిన సృష్టి స్వభావము ననుసరించి అనాదినుండియు ప్రవర్తిల్లుచున్నవి. ముందును ఇట్లే ప్రవర్తిల్లుచుండును.

ఈ జీవలోకము కూడ యుగ స్వభావము ననుసరించి క్షయమును వృద్ధిని పొందుచు మార్పుల నొందుచుండునే కాని ఒక్కక్షణము కూడ మార్పులేక నిలుకడగా నుండదు.

ఇది శ్రీమహాపురాణమున ఆదిబ్రాహ్మమున వ్యాసృషి సంవాదమున భవిష్యకథనము అను రెండువందలముప్పది ఒకటవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters