Sri Sivamahapuranamu-I    Chapters   

అథ చత్వారింశోధ్యాయః

శివదర్శనము

నారద ఉవాచ |

విధే విధే మహాప్రాజ్ఞ శైవతత్త్వ ప్రదర్శక | శ్రావితా రమణీప్రాయా శివలీలా మహాద్భుతా || 1

వీరేణ వీరభ##ద్రేణ దక్షయజ్ఞం వినాశ్య వై | కైలాసాద్రౌ గతే తాత కిమభూత్తద్వదాధునా || 2

నారదుడిట్లు పలికెను -

హే విధీ! నీవు శివతత్త్వమును ప్రదర్శించే మహాప్రాజ్ఞుడవు. మిక్కిలి మనోరంజకము, మహాద్భుతమునగు శివలీలను వినిపించితివి (1). వీరుడగు వీరభద్రుడు దక్షయజ్ఞమును ధ్వంసము చేసి, కైలాస పర్వతమునకు వెళ్లినాడు గదా !ఓ తండ్రీ! తరవాత ఏమైనదో ఇప్పుడు చెప్పుము (2).

బ్రహ్మోవాచ |

అథ దేవగణాస్సర్వే మునయశ్చ పరాజితాః |రుద్రానీకై ర్విభిన్నాంగా మమ లోకం యయుస్తదా || 3

స్వయంభువే నమస్కృత్య మహ్యం సంస్తూయ భూరిశః | తత్య స్వక్లేశం విశేషేణ కార్న్స్యైనైవ న్యవేదయన్‌ || 4

తదాకర్ణ్య తతోహం వై పుత్ర శోకేన పీడితః | అచింతయమతివ్యగ్రో దూయమానే చేతసా || 5

కిం కార్యం కార్యమద్యాశు మయా దేవసుఖావహమ్‌ | యేన జీవతు దక్షోసౌ మఖంః పూర్ణ భ##వేత్సురః || 6

బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడు సర్వదేవగణములు, మరియు మనులు పరాజితులై, రుద్రుని సేనలతే చితకకొట్టబడిన అవయవములు గలవారై నా లోకమునకు వచ్చిరి (3). స్వయంభువుడనగు నాకు సమస్కరించి పరిపరి విధముల స్తుతించి తమకు కలిగిన ఆపత్తును సమగ్రముగా నివేదించిరి (4). పుత్ర శోకముచే పీడితుడనై మిక్కిలి ఆదుర్దాతో దుఃఖముతో నిండిన మనస్సు గల నేను వారి మాటలను విని ఆలోచించితిని (5). ఇపుడు దేవతలకు సుఖము కలుగుటకై నేను చేయదగిన కర్తవ్యమేమి ? దక్షుడు మరల బ్రతికి ఈ యజ్ఞము పూర్తియగు ఉపాయమేది ? (6).

ఏవం విచార్య బహుధా నాలభం శమహం మునే | విష్ణుం తదా స్మరన్‌ భక్యా జ్ఞానమాప్తం తదోచితమ్‌ || 7

అథ దేవైశ్చ మునిభి ర్విష్ణోర్లోకమహం గతః | నత్వా నుత్వా చ వివిధైస్త్స వైర్దుఃఖం న్యవేదయమ్‌ || 8

యథాధ్వరః ప్రపూర్ణస్స్యాద్దేవ యజ్ఞకరశ్చ సః | సుఖినస్స్యుస్సురాస్సర్వే మునయశ్చ తథా కురు || 9

దేవ దేవ రమానాథ విష్ణో దేవసుఖావహ | వయం త్వచ్ఛరణం ప్రాప్తా స్సదేవమునయో ధ్రువమ్‌ || 10

ఇత్యాకర్ణ్య వచో మే హి బ్రహ్మణస్స రమేశ్వరః | ప్రత్యువాచ శివం స్మృత్వా శివాత్మా దీన మానసః || 11

ఓ మహర్షీ! ఇట్లు నేను పరిపరి విధముల ఆలోచించితిని. కాని నాకు మనశ్శాంతి లభించలేదు. అపుడు భక్తితో విష్ణువును స్మరించగా, ఆ సమయమునకు తగిన జ్ఞానము కలిగినది (7). అపుడు దేవతలతో మరియు మునులతో గూడి నేను విష్ణులోకమునకు వెళ్లి నమస్కరించి వివిధ స్తోత్రములతో స్తుతించి మా దుఃఖమును విన్నవించితిని (8). హే దేవా! ఈ యజ్ఞము పూర్ణమై ఆ యజమాని, సర్వ దేవతలు మరియు మునులు సుఖమును పొందు ఉపాయమును చేయుము (9). దేవదేవా! లక్ష్మీ పతీ! విష్ణో! నీవు దేవతలకు సుఖమునిచ్చువాడవు. దేవతలతో మునులతో గూడిమేము నిన్ను నిశ్చయముగా శరణు పొందియున్నాము (10). బ్రహ్మనగు నా ఈ మాటను విని శివస్వరూపుడగు ఆ లక్ష్మీపతి దైన్యముతో గూడిన మనస్సు గలవాడై శివుని స్మరించి ఇట్లు బదులిడెను (11).

విష్ణు రువాచ |

తేజీయసి న సా భూతా కృతాగసి బు భూషతామ్‌ | తత్ర క్షేమాయ బహూధా బభూషా హి కృతాగసామ్‌ || 12

కృతపాపాస్సురాస్సర్వే శివే హి పరమేశ్వరే | పరాదదుర్యజ్ఞభాగం తస్య శంభోర్విధే యతః || 13

ప్రసాదయధ్వం సర్వే హి యూయం శుద్ధేన చేతసా | అథా పరప్రసాదం తం గృహీతాంఘ్రియుగం శివమ్‌ || 14

యస్మిన్‌ ప్రకుపితే దేవే వినిశ్యత్యఖిలం జగత్‌ | సలోకపాలయజ్ఞస్య శాసనాజ్జీవితం ద్రుతమ్‌ || 15

విష్ణువు ఇట్లు పలికెను -

ఉన్నతిని గోరువారు తేజశ్శాలియగు వ్యక్తి విషయములో అపరాధమును చేయుట తగదు. అట్లు అపరాధమును చేయువారికి క్షేమము కలుగదు. వారి కోరిక నెరవేరదు (12). దేవతలందరు పరమేశ్వరుడగు శివుని యందు అపరాధమును చేసిరి. ఓ విధీ !వీరు శంభునకు యజ్ఞ భాగమునీయకుండిరి (13). మీరందరు గొప్ప ప్రసాద బుద్ధిగల ఆ శివుని కాళ్లను పట్టుకొని శుద్ధమగు మనస్సుతో ప్రసన్నుని చేయుడు (14). ఆ దేవుడు కోపించినచో సమస్త జగత్తు నశించును. ఆయన శాసించినచో లోకపాలకుల జీవితము వెంటనే సమాప్తమగును. యజ్ఞము ధ్వస్తమగును (15).

తమాశు దేవం ప్రియయా విహీనం చ దురుక్తిభి ః | క్షమాపయధ్వం హృద్విద్ధం దక్షేణ సుదురాత్మనా || 16

అయమేవ మహోపాయస్తచ్ఛాంత్యై కేవలం విధే | శంభోస్సంతుష్టయే మన్యే సత్యమేవోదితం మయా || 17

నాహం న తవం సురాశ్చాన్యే మునయోపి తనూభృతః | యస్య తత్త్వం ప్రమాణం చ న విదుర్బలవీర్యయోః || 18

ఆత్మతంత్రస్య తస్యాపి పరస్య పరమాత్మనః | క ఉపాయం విధిత్సేద్వై పరం మూఢం విరోధినమ్‌ || 19

చలిష్యేహమపి బ్రహ్మన్‌ సర్వైస్సార్థం శివాలయమ్‌ | క్షమాపయామి గిరిశం కృతాగశ్చ శివే ధ్రువమ్‌ || 20

మిక్కిలి దుష్టుడగు దక్షునిచే తప్పు మాటలను పలికి ఆయన హృదయము గాయపరుచబడినది. ప్రియురాలి తోడు లేని ఆ దేవుని వెంటనే క్షమార్పణను కోరుడు (16). ఓ బ్రహ్మా శంభుడు శాంతించి సంతసించుటకు ఇదియే ఏకైకమగు గొప్ప ఉపాయమని నేను తలంచెదను. నేను సత్యమునే పలుకుచున్నాను (17). నేను గాని, నీవు గాని, ఇతర దేవతలు గాని, మునులు గాని, ఇతర ప్రాణులుగాని ఆయన తత్త్వమును, ఆయన బల పరాక్రమముల సీమలను ఎరుంగజాలగు (18). స్వతంత్రుడు, పరుడు, పరమాత్మయగు ఆ శివునకు విరోధియగు పరమ మూర్ఖునకు ఉపాయమును ఎవరు చెప్పనిచ్చగించెదరు ? (91). ఓ బ్రహ్మా !నేను కూడ మీ అందరితో గూడి శివుని ధామమునకు వచ్చెదను. నేను కూడ శివుని యందు నిశ్చితముగా అపరాధమును చేసితిని. ఇపుడు క్షమార్పణను చెప్పెదను (20).

బ్రహ్మోవాచ |

ఇత్థమాదిశ్య విష్ణుర్మాం బ్రహ్మాణం సామరాదికమ్‌ | సార్థం దేవైర్మతిం చక్రే తద్గిరౌ గమనాయ సః || 21

య¸° స్వధిష్ణ్య నిలయం శివస్యాద్రి వరం శుభమ్‌ | కైలాసం సామరముని ప్రజేశాదియుతో హరిః || 22

అతిప్రియం ప్రభోర్నిత్యం సుజుష్టం కిం నరాదిభిః | నరేతరై రప్సరోభి ర్యోగసిద్ధైర్మహోన్నతమ్‌ || 23

నానామణిమయై శ్శృంగై శ్శోభమానం సమంతతః | నానాధాతు విచిత్రం వై నానాద్రుమలతాకులమ్‌ || 24

బ్రహ్మ ఇట్లు పలికెను -

విష్ణువు దేవతలు మొదలగు వారితో గూడియున్న బ్రహ్మను (నన్ను) ఇట్లు ఆదేశించి, దేవతలతో గూడి శివుని పర్వతమునకు వెళ్లవలెనని నిశ్చయించుకొనెను (21). విష్ణువు దేవతలతో మునులతో దిక్పాలకులతో ఇతరులతో గూడి తన ధామము నుండి బయలుదేరి మంగళకరము, శివుడు నివసించు పర్వత రాజము అగు కైలాసమునకు వెళ్లెను (22). కైలాసము శివప్రభునకు మిక్కిలి ప్రియమైనది. కింనరులు మొదలగు వారిచే సేవింపబడునది, అప్సరసలు మొదలగు దేవతాస్త్రీలచే మరియు యోగసిద్ధులచే సేవింపబడునది, మిక్కిలి ఎత్తైనది (23), అంతటా మణులు పొదిగిన అనేక శిఖరములతో ఒప్పారునది, అనేక ధాతువులతో రంగు రంగుల సానువులు గలది, అనేక విధముల చెట్లతో లతలతో దట్టముగా నిండియున్నది (24).

నానామృగగణాకీర్ణం నానాపక్షి సమన్వితమ్‌ | నానాజల ప్రస్రవణౖ రమరై స్సిద్ధయోషితామ్‌ || 25

రమణౖర్విహరంతీనాం నానాకందర సానుషు | ద్రుమజాతిభి రన్యాభీ రాజితం రాజతప్రభమ్‌ || 26

వ్యఘ్రాదిభిర్మహాసత్త్వైః నిర్ఘుష్టం క్రూరతోజ్ఘితమ్‌ | సర్వోశోభాన్వితం దివ్యం మహావిస్మయ కారకమ్‌ || 27

పర్యస్తం గంగయా సత్యా స్థాన పుణ్యతరోదయా | సర్వపావన సంకర్త్రా విష్ణు పద్యా సునిర్మలమ్‌ || 28

ఆ కైలాసము అనేక రకముల మృగముల గుంపులతో ఆవరింపబడియున్నది. అచట వివిధ రకముల పక్షులు ఉండెను. అనేక కొండకాలువలతో కూడియున్నది. దేవతాస్త్రీలు ప్రియులగు సురలతో గుడి వివిధ గుహలయందు (25) పర్వత సానువులయందు విహరించుచుండిరి. ఆ పర్వతము వెండి వలె కాంతులీనెను. అనేక వృక్ష జాతులతో ప్రకాశించెను (26). క్రౌర్యమును వీడిన వ్యాఘ్రము మొదలగు మహామృగములు అచట తిరుగాడుచుండెను. సమస్త శోభలతో గూడిన ఆ దివ్య పర్వతము గొప్ప అచ్చెరువును కలిగించుచుండెను (27). స్థానమహిమచే మరింత పుణ్యమగు ఉదకములు గలది, సర్వులను పావనము చేయునది, విష్ణు పాదముల నుండి పుట్టినది, పవిత్రమైనది అగు గంగచే చుట్టూవారబడియున్న ఆ పర్వతము నిర్మలముగ నుండెను (28).

ఏవం విధం గిరిం దృష్ట్వాకైలాసాఖ్యం శివప్రియమ్‌ | యయుస్తే విస్మయం దేవా విష్ణ్వాద్యాస్సమునీశ్వరాః || 29

తత్సమీపేలకాం రమ్యాం దదృశుర్నామ తే పురీమ్‌ | కుబేరస్య మహాదివ్యాం రుద్రమిత్రస్య నిర్జరాః || 30

వనం సౌగంధికం చాపి దదృశుస్తత్సమీపతః | సరవద్రుమాన్వితం దివ్యం యత్ర తన్నాదమద్భుతమ్‌ || 31

తద్బాహ్యతస్తస్య దివ్యే సరితావతిపావనే | నందా చాలకంనందా చ దర్శనాత్పాపహారికే || 32

శివునకు ప్రియమైన, కైలాసమని పేరు గాంచిన ఇట్టి పర్వతమును చూచి విష్ణువు మొదలగు దేవతలు మరియు మహర్షులు అచ్చెరువునందిరి (29). ఆ దేవతలు దాని సమీపమునందు శివమిత్రుడగు కుబేరుని అత్యంత దివ్యమైన, అలకయను పేర ప్రఖ్యాతి గాంచిన సుందరమగు పురమును చూచిరి (30). దాని సమీపములో సర్వ విధముల వృక్షములతో కూడిన సౌగింధికమను దివ్యవనమును చూచిరి. ఆ వనములోని పక్షుల ధ్వనులు అద్భుతముగ నుండెను (31). దానికి కొద్ది దూరములో దివ్యములు, మిక్కిలి పవిత్రమైనవి, దర్శనమాత్రముచే పాపములను పొగొట్టునవి అగు నంద, అలకనంద అనే సరస్సులు గలవు (32).

పపుస్సురస్త్రియో నిత్యమవగూహ్య స్వలోకతః | విగాహ్య పుంభిస్తాస్తత్ర క్రీడంతి రతి కర్శితాః || 33

హిత్వా యక్షేశ్వరపురీం వనం సౌగంధికం చ యత్‌ | గచ్ఛంతస్తే సురా ఆరాద్దరృశుశ్శాంకరం వటమ్‌ || 34

పర్యక్‌ కృతాచలచ్ఛాయం పాదోన విటపాయితమ్‌ | శతయోజన కోత్సేధం నిర్నీడం తాపవర్జితమ్‌ || 35

మహాపుణ్యవతాం దృశ్యం సురమ్యం చాతిపావనమ్‌ | శంభుయోగస్థలం దివ్యం యోగిసేవ్యం మహోత్తమమ్‌ || 36

దేవతాస్త్రీలు ప్రతిదినము తమ లోకమునుండి అచటకు వచ్చి వాటిలోని నీటిని త్రాగెదరు. మన్మథ పీడితులగు వారలు తమ ప్రియులతో కలిసి వాటియందు జలక్రీడలాడెదరు (33). కుబేరుని నగరమును, సౌగంధిక వనమును దాటి ఆ దేవతలు కొద్ది దూరము వెళ్లి శంకరుని మర్రి చెట్టును చూచిరి (34). దాని ఊడల్నియు వేర్వేరు వృక్షములా అన్నట్లున్నవి. అది బహువిస్తారమగు తొలగిపోని నీడను ఇచ్చుచుండెను. దాని క్రింద చల్లగా నుండెను. అది వంద యోజనముల ఎత్తుండెను. దాని యందు పక్షుల గూళ్లు లేకుండెను (35). ఆ స్థలములో శంభుడు తపస్సును చేసెను. ఆ దివ్య స్థలము మహాపుణ్యాత్ములకు మాత్రమే చూడనగును. ఆ సుందర స్థలము పరమ పావనమైనది. మహోత్తరమగు ఆ స్థలమును యోగులు సేవించెదరు (36).

ముముక్షు శరణ తస్మిన్‌ మహాయోగమయే వటే | ఆసీనం దదృశుస్సర్వే శివం విష్ణ్వాదయస్సురాః || 37

విధి పుత్రైర్మహాసిద్ధై శ్శివభక్తిరతైస్సదా | ఉపాస్యమానం సుముదా శాంతై స్సంశాంత విగ్రహైః || 39

తథా సఖ్యా కుబేరేణ భర్త్రా గుహ్యకరక్షసామ్‌ | సేవ్యమానం విశేషేణ స్వగణౖర్‌జ్‌జ్ఞ తిభిస్సదా || 39

తాపసాభీష్టసద్రూపం బిభ్రతం పరమేశ్వరమ్‌ | వాత్సల్యా ద్విశ్వసుహృదం భస్మాది సువిరాజితమ్‌ || 40

ముముక్షువులకు శరణమైనది, మహాయోగాత్మకము అగు ఆ వటవృక్షముపై కూర్చుండియున్న శివుని విష్ణువు మొదలగు దేవతలందరు గాంచిరి (37). మహాసిద్ధులు, సర్వదా శివభక్తియందు రమించువారు, సుందరమగు దేహములు గలవారు, శాంతమూర్తులు అగు బ్రహ్మపుత్రులు ఆనందముతో శివుని ఉపాసించుచుండిరి (38).యక్ష రాక్షసులకు ప్రభువు, మిత్రుడునగు కుబేరుడు, ఆతని జ్ఞాతులు , శివుని గణములు ఆ శివుని ప్రత్యేకముగా సర్వదా సేవించుచుండిరి (39). సర్వప్రాణులకు వాత్సల్యమును చూపే మిత్రుడు అగు పరమేశ్వరుడు భస్మము మొదలగు వాటితో ప్రకాశించువాడై తపశ్శాలురకు అభీష్టమగు దివ్యరూపమును ధరించుయుండెను (40).

మునే తుభ్యం ప్రవోచంతం పృచ్ఛతే జ్ఞానముత్తమమ్‌| కుశాసనే సూపవిష్టం సర్వేషాం శృణ్వతాం సతామ్‌ || 41

కృత్వోరౌ దక్షిణ సవ్యం చరణం చైవ జానుని | బాహు ప్రకోష్ఠాక్షమాలం స్థితం సత్తర్కముద్రయా || 42

ఏవం విధం శివం దృష్ట్వా తదా విష్ణ్వా దయస్సురాః | ప్రణముస్త్వరితం సర్వే కరౌ బద్ధ్వా వినమ్రకాః || 43

ఉపలభ్యాగతం రుద్రో మయా విష్ణుం సతాం గతిః | ఉత్థాయ చక్రే శిరసాభివందనమపి ప్రభుః || 44

ఓ మహర్షీ! ఆయన దర్భాసనమునందు గూర్చుండి మహర్షులందరు వినుచుండగా నీవు అడిగిన ప్రశ్నలకు సమాధానముగా ఉత్తమ జ్ఞానమును బోధించుచుండెను (41). ఆయన కుడి తొడపై ఎడమ కాలిని, జానువును ఉంచి, బాహువుల నుండి ముంజేతుల నుండి వ్రేలాడుచున్న రుద్రాక్ష మాలలు గలవాడై జ్ఞానముద్రతో కూర్చుండెను (42). అపుడు ఇట్టి శివుని చూచి విష్ణువు మొదలగు దేవతలందరు వినయముతో చేతులు కట్టుకొని శీఘ్రముగా నమస్కరించిరి (43). సత్పురుషులకు గతియగు రుద్రప్రభుడు అచటకు వచ్చిన నన్ను విష్ణువును చూచి లేచి శిరస్సుతో అభివాదమును కూడ చేసెను (44).

వందితాంఘ్రిస్తదా సర్వైర్దివ్యైర్విష్ణ్వాదిభిశ్శివః | ననామాథ యథా విష్ణుః కశ్యపం లోకసద్గతిః || 45

సురసిద్ధ గణాధీశ మహర్షి సునమస్కృతమ్‌ | సమువా చ సురైర్విష్ణుః కృతసన్నతి మాదరాత్‌ || 46

ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే శివదర్శన వర్ణనం నామ చత్వారింశోధ్యాయః (40).

విష్ణువు మొదలగు దేవతలందరిచే నమస్కరింపబడిన పాదములు గల శివుడు, లోకములకు సద్గతినిచ్చు విష్ణువు కశ్యప ప్రజాపతికి నమస్కరించిన తీరున, మాకు నమస్కరించెను (45). దేవతలు, సిద్ధులు, గణాధీశులు మరియు మహర్షులచే సాదరముగా నమస్కరింపబడిన శివుని ఉద్దేశించి విష్ణువు దేవతలతో గూడి ఇట్లు పలికెను (46).

శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు సతీఖండములో శివదర్శన వర్ణనమనే నలుబడి యవ అధ్యాయము ముగిసినది (40).

Sri Sivamahapuranamu-I    Chapters