Nadichedevudu   Chapters  

57. శ్రీ విజయేంద్ర సరస్వతి

క్రీస్తుకు పూర్వం సుమారు అయిదుశతాబ్దాల కిందట ఆద్య శంకరాచార్యులచే స్థాపించబడిన శ్రీ కంచికామకోటిపీఠం అధిపతుల పరంపరలో 1983, మే నెల 24 తేది సోమవారంనాడు ఆ పీఠాన్ని అధిష్ఠించిన శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి 70వ వారు.

శ్రీశంకరభగవత్పాదులనుంచి నేటివరకు రమారమి రెండువేలఅయిదు వందల సంవత్సరాలు కామకోటిపీఠాధిపత్యం అవిచ్ఛిన్నంగా, నిరంతరాయంగా కొనసాగడం మఠానుయాయులకేకాక, హిందువు లందరికీ హర్షదాయకం.

ఆరేడు సంవత్సరాలక్రితం కామకోటిపీఠాధిపతి శ్రీజయేంద్రసరస్వతి స్వామి, అప్పటికి పదునాలుగేళ్ళు నిండీనిండని శంకరం అనే ఒక వేదవిద్యార్థికి కంచిలో, శ్రీ కామాక్షీఅమ్మవారి సన్నిధిలో యధావిధిగా గురూపదేశం చేసి, సన్యాసదీక్ష ఇచ్చారు.

పద్నాలుగేళ్లు నిండని ప్రాయంలో శ్రీ జయేంద్ర సరస్వతులచే గురూపదేశం పొంది ఆశ్రమస్వీకారం చేసిన ఆ బాలసన్యాసి ఎవరు? ఏమా బాలుని బుద్ధికుశలత? ఎందరో వేదవిద్యార్థు లుండగా, ఏ కారణం చేత అతడే కాంచికామకోటి భవిష్యత్‌పీఠాధిపతిగా వరించబడవలసి వచ్చింది?

పొన్నేరికి సమీపాన తండలం అనే చిన్నగ్రామంలో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబం ఆ గ్రామంలో బ్రహ్మ శ్రీ ముక్కామల కృష్ణమూర్తిశాస్త్రి అనే వేదపండితుని నాల్గవ పుత్రరత్నం నేటి విజయేంద్రుడు. పూర్వాశ్రమంలో తల్లితండ్రులు ఆ బాలుడికి పెట్టిన పేరు శంకరం. అయిదవతరగతివరకు శంకరం మామూలు పాఠశాలలో చదివాడు. అప్పటినుంచే తన అన్నదమ్ములకంటే, తన క్లాసులోని తోటి విద్యార్థుల కంటె కూడా కుశాగ్రబుద్ధిగా గుర్తించబడుతూ వచ్చాడు.

తండ్రి శ్రీ కృష్ణమూర్తిశాస్త్రి తన తనయుని మేధాసంపత్తిని గుర్తించారు. మామూలు పాఠశాలచదువుకు స్వస్తి చెప్పించి, తనవద్దనే పోలూరు వేదపాఠశాలలో వేదం చెప్పసాగారు.

అదిమొదలు ఏడుసంవత్సరాలు శంకరం వేదాధ్యయనం చేశాడు. వేద విద్యార్థులకు ఏటేటా తంజావూరు, తిరుచిరాపల్లిజిల్లాలలో జరిగే వేదపరీక్షలన్నిటిలో శంకరం ప్రథమబహుమతిని పొందుతూ, విద్యార్థులలో అగ్రగణ్యుడవుతూ వచ్చాడు. సామాన్యంగా ఏడేళ్లు చదవవలసిన ఋగ్వేదాన్ని మూడుసంవత్సరాలలోనే పూర్తి చేశాడు.

ముసిరిలో జరిగిన వేదపరీక్షలో తమిళనాడులోని 48 వేదపాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. అన్ని వందలమంది విద్యార్థులలోనూ ఆ సంవత్సరం శంకరమే అగ్రేసరుడై ప్రథమబహుమతిని సంపాదించాడు. శంకరం ఏకసంథాగ్రాహిగా పండితులు గుర్తించారు.

బాలశంకరుని మేధాసంపత్తికి, సమయస్ఫూర్తికి తార్కాణంగా మరొక సందర్భాన్ని పేర్కొనవచ్చు. ఒక సంవత్సరం కంచికామకోటిపీఠంలో శ్రీ జయేంద్రసరస్వతిస్వామి ఆధ్వర్యంలో నవరాత్రిపూజ జరుగుతూ ఉండగా పండితులు చదివే వేదమంత్రాలలో ఒక ప్రమాదం వాటిల్లింది. అంతటి మహాసభలో పండితు లెవ్వరూ గమనించని ఆ దోషాన్ని శంకరం ఒక్కడే కనిపెట్టి, దానిని సభవారి దృష్టికి తేవడం, అప్పు డా బాలుని థీశక్తిని శ్రీ జయేంద్రసరస్వతు లెంతో ప్రశంసించడం జరిగింది. తన అనంతరం కామకోటిపీఠాధిపతిగా ప్రతిభావంతుడైన ఈ బాలుని నియమించుకోవాలనే సంకల్పం శ్రీ జయేంద్రసరస్వతికి అప్పుడే ఉదయించిందేమో!

అటు తరువాత శ్రీ జయేంద్రసరస్వతి ఈ విషయం పరమాచార్యులకు నివేదించి, ఉభయులూ సంప్రతించుకొనిన పిమ్మటనే శంకరం తల్లిదండ్రులకు తమ నిశ్చయాన్ని వెల్లడించారు. తల్లిమాత్రం ప్రేమాస్పదుడైన తన కుమారుడు తన కంటిఎదుట లేకుండ, విరాగి కావలసివచ్చెనే అని ఆదిలో కొంత విచారపడినా, కొడుకు కామకోటిమహాపీఠాన్ని అధిష్ఠించి, జగద్గురువు కాగలడన్న ఉత్సాహంతో ఆమె తన సమ్మతిని కూడా తెలియజేసింది.

శంకరం సన్యాసదీక్ష వహించడానికి 1983 మే నెల 29 తేదీన ముహూర్తం నిర్ణయించబడింది. దీక్ష స్వీకారానికి ముందు వ్రతాలు, ఉపవాసాలు, నియమనిష్ఠలు మొదలైన కార్యకలాపమంతా , పితృకర్మతో సహా యధావిధిగా, సంప్రదాయ బద్ధంగా శ్రీ జయేంద్రసరస్వతుల పర్యవేక్షణలో కొనసాగించాడు శంకరం. ఒక రాత్రి రాత్రంతా గాయత్రీమంత్రం జపించి, మరుసటి ఉదయం శ్రీకామాక్షీదేవి ఆలయ తటాకంలో వేలాదిపురజనుల సమక్షంలో జయేంద్రసరస్వతిచే గురూపదేశం పొంది శంకరం కాషాయాన్ని దండకమండలాలను ధరించి విజయేంద్రసరస్వతిగా అవతరించారు.

కాషాయవస్త్రాలను, రుద్రాక్షలను, దండకమండలాలను ధరించిన విజయేంద్రుని చూసినవారంతా ఆదిశంకరుడు భూమిమీద తిరిగి అవతరించాడా అని భావించారు. ఆశ్చర్యకరమైన విషయమేమంటే 'యథాకృతి స్తత్రగుణా భవంతి' అన్నట్టు సకలజనాకర్షకమైన ఆకృతికి తోడు, దానికి సదృశ##మైన గుణమూ, తదనుగుణమైన నామధేయమూ - ఇన్ని గుణాలు ఒక్క వ్యక్తిలో మూర్తీభవించడం నాన్యతో లభ్యం.



శ్రీ జగద్గురు

శ్రీ చంద్రశేఖరాష్టకమ్‌

శ్రీ జనార్థనస్వామి

చంద్రశేఖర మిందు మంజుల సుస్మితోల్లసదాననం

కామకోటి సుపీఠమండన మాశ్రి తామర భూరుహమ్‌.

భక్తకోటి హృదన్తరాతత తాపనోది సుధాకరమ్‌

భూమి మాగత మిందుశేఖర మాశ్రయే భవ తారకమ్‌.

చంద్రశేఖర సద్గురూత్తమ పాదపంకజ మాశ్రయే

జన్మకోటి పరంపరాగత దృశ్యదర్శన వాసనామ్‌.

సత్య ఏవ వినాశ##యే చ్ఛుభ వాసనా మిహ యోజయేత్‌

యత్ప్రయచ్ఛతి బోధమాశ్యపవర్గ మప్యతిదుర్లభమ్‌.

చంద్రశేఖరకింకరాః కిల మన్వతే భవవారిధిమ్‌

గోష్పదం విధిలోకభూతిసమృద్ధి మప్యణుసమ్మితామ్‌

బ్రహ్మభావ సునంపదం నిజపాణిపల్లవ సంగతాం

జానతేs పి చ నిష్క్రియామల నిత్యముక్త సదాత్మతామ్‌.

దక్షిణాస్యమమౌనముద్ర మమోఘబోధ విధాయినమ్‌

శంకరార్య మవాద గాఢగిరం మృదూక్తి సుబోధకమ్‌.

త్యక్త నాగ విభూషణం హ్యభయప్రదం శశిశేఖరం

చంద్రశేఖర మిందు శీతల వీక్షణం గురుమాశ్రయే.

ముగ్థ ముగ్థ సుమోహనాంగ కలాప నిర్జిత మన్మథం

యుక్తి యుక్త సుచారు భాషణ నిర్జితామరదేశికమ్‌

చిన్మయాద్వయ వస్తుదర్శన శాంత నిర్‌వృత మానసం

చంద్రశేఖర మాశ్రయే యతి బృంద వంద్య పదాంబుజమ్‌.

ఇందుశేఖర మిందు సుందర మిందుశీతల భాషణమ్‌

వంద్య పాద మవంధ్య భాష మనింద్య చారు సువర్తనమ్‌

సత్య చిద్ఘన మత్య గోచర చైత్య ముక్త చిదాత్మకం

సద్గురుం గురుమోహవారక మాశ్రయే జగతాం గురుమ్‌.

ముక్త పుష్ప శ##రేక్షుచాప సుపాణి మీశ్వర వల్లభాం

ముక్త వర్ణ పదాకృతిం శ్రుతిశేఖరం పురుషాకృతిమ్‌

ముక్తి మాదృత దివ్య మానుష విగ్రహాం భువి భాసురాం

భావయే గురు చంద్రశేఖర మిజ్య పూజ్య పదాంబుజమ్‌.

శాస్త్రదృష్టి సుసంభృతం శ్రుతిసంఘమాన్య సమన్వయం

శాస్త్రయోని మనన్యతాంచిత కార్యజాత మహేతుకమ్‌

అక్షరం చ తదంబరాన్త విధారణోద్యత మవ్యయం

వ్యాస సూక్తి సమంచితం గురు చంద్రశేఖర మాశ్రయే.

శ్రీ చంద్రశేఖరేంద్ర శ్రీ సరస్వత్యంఘ్రి పంకజే

భక్త్యార్పితా స్తుతి రియం ప్రీయతాం జగతాం గురుః.



వేదానికీ, ఇతరమతాలకూ భేదం

ఇతరమతాలు తమ మార్గమే సత్యమనీ, తక్కినవి నరక హేతువులనీ చెబుతున్నాయి. ఒక గమ్యానికే పెక్కుమార్గా లున్నాయని వేదం ఒక్కటే చెబుతున్నది.

Nadichedevudu   Chapters