Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page

విద్వత్సభ
(డానియల్‌ స్మిత్‌)

ఇలయాత్తంగుడిలో 1962 సంవత్సరంలో జరిగిన విద్వత్సభ సందర్భంలో కామకోటి స్వాములవారిని నేను దర్శంచడం జరిగింది. శ్రీవారు సభలో నన్నుకూడ పాల్లొన మన్నారు.

ఇలయాత్తం గుడికి రాగానే శ్రీవారు పూజకుపోయే మార్గంలో నిలుచుంటే ఆయనను సులభంగాదర్శించవచ్చునని అక్కడివారు అన్నారు. నేను శ్రీవారిని కలసినపుడు ఏమేమిచేయాలో ఒకటి పథకం వేసుకొని వచ్చినాను. తీరా వారిని కలుసుకొన్నపుడు నా పథకం గాలి కెగిరిపోయింది. ఆయనను చూడగానే అన్నీ మరచిపోయి తబ్బిబ్బులైంది. అది వారు గమనించి చేతితో సైగచేస్తూ కంగారు పడవద్దని ఊరడించారు. అంతటితో శాంతించాను.

6-19)

నేను అనుకొన్నది వేరు. జరిగినది వేరు. శ్రీవారిని ఇంత చిన్న పుట్టుక అని అనుకోలేదు నేను. ఆయన చిక్కిపోయిన చిన్న దేహాన్ని చూచి ఆశ్చర్యపోయాను. కాని ఆయన బలం అంతా ఆయన కండ్లలోనేవుంది. తలచుకొంటే ఈనాటికీ ఆకన్నులు అట్లాగే గోచరిస్తాయి. ఆ కనులు ఎంత దీప్తివంతములని? మనస్సులోకి అవి చొచ్చుకొని పోతుంది. కానీ ఆ కన్నులు స్నేహార్ద్రంగా వుంటవి. జరిగిన సంభాషణ కూడ చాలవరకూ మౌనమే. ఆగమశాస్త్రాలలో వేనిని చూస్తున్నావన్నారు. నేను పాంచరాత్రంలో చేస్తున్న పరిశోధన గూర్చి చెప్పాను. ఐతే నీవరకూ ఈ పరిశోధన ప్రేమకలాపమన్నమాట అన్నారు శ్రీవారు!

ఆయన అనుగ్రహం మరొక విధంగా కూడ చూపారు.

1962- సెప్టెంబరు 15 వ తేది నేను విద్వత్సభలూ పాల్కోవాలి. విద్వాంసు లందరూ పాల్గొంటున్న ఆసభలో నేను మాట్లాడడానికి జంకినది వాస్తవమే. అంతేకాక గ్రహణితో బాధపడుతున్నా. ఈ రెండూ చేరి మానసికంగానూ, నన్ను బలహీన పరచింది.

రాత్రి సుమారు 11 గంటలకు, స్వామివారు పంపారని ఆయన శిష్యులలో ఒకరు వచ్చారు. స్వాములవారు ఒక చీనీ పండును ఆయనవద్ద పంపి, దానిని తీసుకోమన్నారట. నాకు ఒళ్ళు బాగాలేదని ఎవరో చెప్పారు. నేను ముందువెనుక లాడినాను. ఈ బాధలో ఈ పండుతింటే- ఎమన్నావికారం చేస్తుందేమోనని ఆ పండును తర్వాత తీసుకొంటానన్నా. కాని తీసుకొన్నంతవరకూ ఆ వచ్చిన మనిషి కదలలేదు.

మరుసటి దినం తెల్లవారి విచిత్రంగా నా గ్రహణి మాయమైంది. దేహమూ మనస్సూ రెండు అపూర్వంగా ఉత్సాహకరంగా మారేయి స్వామి అనుగ్రహబలంతో.

డానియల్‌ స్మిత్‌

(అసిస్టెంట్‌ ప్రొఫెసరు సైరాక్యూజ్‌ యూనివర్శిటీ సైరాక్యూజ్‌

న్యూయార్క్‌ యూ. ఎస్‌. ఏ.)


Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page