Sri Sivamahapuranamu-I    Chapters   

అథ ద్వితీయోsధ్యాయః

నారదుని తపస్సు

సూత ఉవాచ -

ఏకస్మిన్‌ సమయే విప్రా నారదో మునిసత్తమః | బ్రహ్మపుత్రో వినీతాత్మా తపోర్థం మన ఆదధే || 1

హిమశైల గుహా కాచిదేకా పరమశోభనా | యత్సమీపే సురనదీ సదా వహతి వేగతః || 2

తత్రాశ్రమో మహాదివ్యో నానాశోభాసమన్వితః | తపోర్థం స య¸° తత్ర నారదో దివ్యదర్శనః || 3

తం దృష్ట్యా మునిశార్దూలస్తేపే స సుచిరం తపః | బద్ధ్వాసనం దృఢం మౌనీ ప్రాణానాయమ్య శుద్దధీః || 4

సూతుడిట్లు పలికెను -

ఓ విప్రులారా! ఒకప్పుడు మునిశ్రేష్ఠుడు, బ్రహ్మ గారి కుమారుడు, వినయస్వభావము కలవాడు నగు నారదుడు తపస్సును చేయు సంకల్పించెను (1). హిమవత్పర్వతము నందు ఒక మిక్కిలి సుందరమగు గుహ కలదు. దాని సమీపమునందు జీవనదియగు గంగ వేగముగా ప్రవహించుచుండును (2). అచట అనేక శోభలతో గూడిన దివ్యమగు ఆశ్రమము గలదు. పుణ్యదర్శనుడగు నారదుడు తపస్సు చేయుటకు అచటికి వెళ్లెను (3). ఆ ముని పుంగవుడు ఆ ఆశ్రమమును చూచి, అచటనే దృఢమగు ఆసనమును వేసి, మౌనియై, ప్రాణయామమునుచేసిస పవిత్రాంతః కరణుడై దీర్ఘకాలము తపమాచరించెను (4).

చక్రే మునిస్సమాధిం తమహం బ్రహ్మేతి యత్ర హ | విజ్ఞానం భవతి బ్రహ్మసాక్షాత్కారకరం ద్విజాః || 5

ఇత్థం తపతి తస్మిన్‌ వై నారదే మునిసత్తమే | చకంపేsథ శునాసీరో మనస్సం తాపవిహ్వల ః|| 6

మనసీతి విచింత్యాసౌ మునిర్మే రాజ్యమిచ్ఛతి | తద్విఘ్న కరణార్థం హి హరిర్యత్న మియేష సః || 7

సస్మార స్మరం శక్రశ్చేతసా దేవనాయకః | ఆజగామ ద్రుతం కామస్సుమధీర్మహి మాన్వితః || 8

నారదముని 'అహం బ్రహ్మాస్మి (బ్రహ్మము నేనే)' అను దర్శనము గల సమాధిని పొందెను. ఓ ద్విజులారా! ఇట్టి తపస్సు వలన బ్రహ్మ సాక్షాత్కారహేతువగు జ్ఞానము సిద్ధించును (5). మునిశ్రేష్ఠుడగు నారదుడు ఈ తీరున తపస్సు చేయుచుండగా, ఇంద్రుని మనస్సు తీవ్రమగు ఆదుర్ధాతో కంపించెను (6). 'ఈమహర్షి నారాజ్యమును కోరుచున్నాడు' అని తలపోసిన వాడై ఇంద్రుడు నారదుని తపస్సునకు విఘ్నము చేయ నిశ్చయించుకొనెను (7). దేవతలకు నాయకుడగు ఇంద్రుడు మనస్సులో మన్మథుని స్మరించెను. అపుడు మహిమ గలవాడు, పుష్పబాణుడు నగు మన్మథుడు వెంటనే విచ్చేసెను.

అ ధాగతం స్మరం దృష్ట్వా సంబోద్య సురరాట్‌ ప్రభుః | ఉవాచ తం ప్రపశ్యాశు స్వార్థే కుటిలశేముషిః || 9

ఇంద్ర ఉవాచ |

మిత్రవర్య మహావీర సర్వదా హితకారక | శృణు ప్రీత్యా వచో మే త్వం కురు సాహాయ్యమాత్మనా || 10

త్వద్బలాన్మే బహూనాం చ తపోగర్వో వినాశితః | మద్రాజ్యస్థిరతా మిత్ర త్వదనుగ్రహతస్సదా || 11

హిమశైల గుహాయాం హి మునిస్తపతి నారదః | మనసోద్దిశ్య విశ్వేశం మహా సంయమవాన్‌ దృఢః || 12

దేవతలకు ప్రభువగు ఇంద్రుడు మన్మథుని రాకను చూచెను. ఆతడు స్వార్ధమును సాధించుకొనుటలో కుటిలమగు బుద్ధి చతురత గలవాడు. ఆతడు మన్మథుని వెంటనే పిలిచి ఇట్లు పలికెను (9).

ఇంద్రుడిట్లు పలికెను -

ఓ శ్రేష్ఠమిత్రమా! నీవు గొప్ప వీరుడవు. మాకు ఎల్లవేళలా హితమును చేయువాడవు. నీవు నా మాటను ప్రీతితో విని, సాహాయ్యమును చేయుము (10). నేను నీ బలముతోనే అనేకుల తపోగర్వమును అడంచితిని . ఓ మిత్రమా! నా రాజ్యము యొక్క స్థిరత్వము అన్ని వేళలా నీ అనుగ్రముపై నాధారపడి యున్నది (11). హిమవత్పర్వత గుహలో నారదముని జగత్పితను ఉద్దేశించి గొప్ప నియమముతో కఠినమగు తపము నాచరించుచున్నాడు (12).

యాచేన్న విధితో రాజ్యం స మమేతి విశంకితః | అద్యైవ గచ్ఛ తత్ర తత్తపోవిఘ్నమాచర || 13

ఇత్యాజ్ఞప్తో మహేంద్రేణ స కామస్సమధుప్రియః | జగామ తత్థ్సలం గర్వాదుపాయం స్వం చకార హ || 14

రచయామాస తత్రాశు స్వకలాస్సకలా అపి | వసంతోsపి స్వప్రభావం చకార వివిదం మదాత్‌ || 15

న బభూవ మునేశ్చేతో వికృతం మునిసత్తమాః | భ్రష్టో బభూవ తద్గర్వో మహేశానుగ్రహేణ హ || 16

ఆ నారదుడు బ్రహ్మ నుండి నా రాజ్యమును వరముగా కోరునేమో యను శంక నాకు గలదు. నీవీనాడే అచటకు వెళ్లి, ఆయన తపస్సునకు విఘ్నమును కలిగించుము (13). ఈ విధముగా మహేంద్రునిచే ఆజ్ఞాపింపబడిన ఆ మన్మథుడు ప్రియమిత్రుడగు వసంతునితో గూడి గర్వముతో ఆ ప్రదేశమునకు వెళ్లి తన ఉపాయమును మొదలిడెను (14). ఆతడచట వెనువెంటనే తన కళలనన్నిటినీ ప్రదర్శింపజొచ్చెను. వసంతుడు కూడా గర్వించిన వాడై, తన ప్రభావమును అనేక విధములుగా చూపెట్టెను (15). ఓ మునిశ్రేష్ఠులారా! నారదముని యొక్క మనస్సు మహేశుని అనుగ్రహముచే వికారమును పొందలేదు. మన్మథునకు గర్వభంగమాయెను (16).

శృణుతాదరతస్తత్ర కారణం శౌనకాదయః | ఈశ్వరానుగ్రహేణాత్ర న ప్రభావః స్మరస్య హి || 17

అత్రైవ శంభునాsకారి సుతపశ్చ స్మరారిణా | అత్రైవ దగ్దస్తేనాశు కామో మునితపోపహః 18

కామ జీవనహేతోర్హి రత్యా సంప్రార్ధితైస్సురైః | సంప్రార్థిత ఉవాచేదం శంకరో లోకశంకరః || 19

కంచిత్సమయమాసాద్య జీవిష్యతి సురాః స్మరః | పరం త్విహ స్మరో పాయశ్చరిష్యతి న కశ్చన || 20

ఇహ యావద్దృశ్యతే భూర్జనై స్థ్సి త్వాs మరాస్సదా | కామబాణ ప్రభావోsత్ర న భవిష్యత్య సంశయమ్‌ || 21

ఓ శౌనకాది ఋషులారా! అట్లు జరుగుటకు గల కారణమును శ్రద్ధగా వినుడు. ఈశ్వరుని అనుగ్రహముచే ఆ ప్రదేశములో మన్మథుని ప్రభావము నిరుపయోగము (17). మన్మథ శత్రువగు శంభుడు గొప్ప తపస్సు చేసిన స్థలమదియే. మహర్షుల తపస్సును భంగము చేయు మన్మథుడచటనే శివునిచే దహింపబడినాడు (18). మన్మథుని బ్రతికించుడని రతీదేవి దేవతలను ప్రార్థించగా, వారు శివుని ప్రార్థించిరి. లోకములకు మంగళములను కలుగజేయు శంకరుడు అపుడిట్లనెను (19). ఓ దేవతలారా! కొంతకాలము తరువాత మన్మథుడు మరల జీవించగలడు. కాని ఈ స్థానములో మన్మథుని ఆటలేమియూ సాగవు (20). ఓ దేవతలారా! ఇచట నుండి కనుచూపుమేర వరకు ఉండే ప్రదేశములో మన్మథ బాణముల ప్రభావము చెల్లదు. దీనిలో సందియము లేదు (21).

ఇతి శంభూక్తితః కామో మిథ్యాత్మ గతికస్తదా | నారదే స జగామాశు దివమింద్ర సమీపతః || 22

ఆచఖ్యౌ సర్వవృత్తాంతం ప్రభావం చ మునే స్స్మరః | తదాజ్ఞయా య¸° స్థానం స్వకీయం స మధుప్రియః || 23

విస్మితోsభూత్సురాధీశః ప్రశశంసాథ నారదమ్‌ | తద్వృత్తాంతానభిజ్ఞో హి మోహితశ్శివ మాయయా || 24

దుర్‌ జ్ఞేయా శాంభవీ మాయా సర్వేషాం ప్రాణినామిహ | భక్తం వినార్పితాత్మానం తయా సమ్మోహ్యతే జగత్‌ || 25

శివుని ఈ పలుకుల చే నారదుని యందు చూపదలచిన తన ప్రతాపము భగ్నము కాగా, మన్మథుడు వెనువెంటనే స్వర్గములో ఇంద్రుని వద్దకు వెళ్లెను (22).మన్మథుడు నారదుని ప్రభావమును, జరిగిన వృత్తాంతమును పూర్తిగా ఇంద్రునకు విన్నవించెను. వసంత మిత్రుడగు మన్మథుడు ఇంద్రుని వద్ద సెలవు తీసుకుని తన స్థానము చేరెను (23).అపుడు ఇంద్రుడు ఆశ్చర్య చకితుడై నారదుని ప్రశంసించెను. నారదుని వృత్తాంతము నెరుంగని ఇంద్రుడు శివమాయచే మోహితుడయ్యెను (24).శివుని మాయ సర్వప్రాణులకు తెలియ శక్యము కానిది. సర్వ స్వార్పణము చేసిన భక్తుడు తక్క ఈ జగత్తంతయూ శివమాయచే మోహితమగును (25).

నారదోsపి చిరం తస్థౌ తత్రేశాను గ్రహేణ హ | పూర్ణం మత్వా తపస్తత్‌ స్వం విరరామ తతో మునిః || 26

కామాజ్ఞయం నిజం మత్వా గర్వితోsభూన్మునీశ్వరఃశ | వృథైవ విగతజ్ఞాన శ్శివవయా విమోహితః|| 27

ధన్యా ధన్యా మహామాయా శాంభవీ మునిసత్తమాః | తద్గతిం నహి పశ్యంతి విష్ణు బ్రహ్మాదయేsపి హి || 28

తయో సం మోహితోsతీవ నారదో మునసత్తమః కైలాసం ప్రయ¸° శీఘ్రం స్వవృత్తం గదితుం మదీ || 29

ఈశ్వరుని అనుగ్రహముచే నారదుడచటనే చిరకాలముండెను. తరువాత ఆ మహర్షికి తన తపస్సు పూర్ణమైనదనే తలంపు కలిగి విరమించెను (26).మన్మథునిపై విజయము తన ప్రభావమేనని ఆ మహర్షి తలపోసెను. ఆయన శివమాయచే మోహితుడయ్యెను. ఆయన జ్ఞానము వృథా అయెను (27). ఓ మునిశ్రేష్ఠులారా! శంభుని మహా మాయ మిక్కిలి ధన్యమైనది. బ్రహ్మ, విష్ణువు మొదలగు వారికి కూడా దాని ప్రసారము తెలియకుండును (28). మునిశ్రేష్ఠుడగు నారదుడు ఆ మాయచే మిక్కిలి సంమోహితుడై, తన మహిమను శివునకు చాటిచెప్పే ఉద్దేశ్యముతో వెంటనే కైలాసమునకు బయలు దేరెను (29).

రుద్రం నత్వాబ్రవీత్సర్వం స్వవృత్తం గర్వవాన్మునిః | మత్వాత్మానం మాహాత్మానం స్వప్రభుం చ స్మరంజయమ్‌ || 30

తచ్ఛ్రుత్వా శంకరః ప్రాహ నారదం భక్తవత్సలః | స్వమాయా మోహితం హేత్వనభిజ్ఞం భ్రష్టచేతసమ్‌ || 31

గర్వితుడగు ఆ మహర్షి తాను మహాత్ముడననియు, మన్మథుని పై విజయము తన ప్రభావమేననియు తలంచినవాడై, రుద్రునకు నమస్కరించి తన వృత్తాంతమునంతయూ చెప్పెను (30). భక్త వత్సలుడగు శంకరుడా పలుకులను విని, తన మాయచే మోహితుడై వివేకమును కోల్పోయిన ఆనారదునితో నిట్లనెను (31).

రుద్ర ఉవాచ |

హే తాత నారద ప్రాజ్ఞ ధన్యస్త్వం శృణు మద్వచః | వాచ్యమేవం న కుత్రాపి హరేరగ్రే విశేషతః || 32

పృచ్ఛమానోsపి న బ్రూయాః స్వవృత్తం మే యదుక్తవాన్‌ | గోప్యం గోప్యం సర్వథా హి నైవ వాచ్యం కదాచన || 33

శాస్మ్యహం త్వాం విశేషేణ మమ ప్రియతమో భవాన్‌ | విష్ణుభక్తో యతస్త్వం హి తద్భక్తోsతీవ మేsనుగః || 34

శాస్తి స్మేత్థం చ బహుశో రుద్రస్సూతికరః ప్రభుః | నారదో న హితం మేనే శివమాయావిమోహితః || 35

రుద్రుడు ఇట్లనెను -

వత్సా!నారదా! నీవు ప్రాజ్ఞుడవు. ధన్యుడవు. నీ నామాటను వినుము. ఈ మాటలను ఇతరుల వద్ద చెప్పకుము. విష్ణువు యెదుట సుతరాము చెప్పకుము. (32). నీవు నాకు చెప్పిన ఈ వృత్తాంతమును రహస్యముగ నుంచుము. ఏనాడైననూ బయటపెట్టకుము(33) నీవు విష్ణుభక్తుడవు. విష్ణుభక్తులు నాయందు కూడ భక్తిని కలిగియుందురు. కావున, నీవు నాకు మిక్కిలి ప్రియమైనవాడవు. నేను నిన్ను ప్రత్యేకించి శాసించు చున్నాను (34). ఈ విధముగా, జగత్తును సృష్టించి పాలించు రుద్రుడు నారదునికి అనేక విధముల నచ్చచెప్పెను. అయిననూ, శివమాయచే విమోహితుడైన నారదుడు ఆ మాటలను లెక్కచేయలేదు (35).

ప్రబలా భావినీ కర్మ గతిర్‌ జ్ఞేయా విచక్షణౖః | న నివార్యా జనైః కైశ్చిదపీచ్ఛా సైవ శాంకరీ || 36

తతస్స మునివర్యో హి బ్రహ్మలోకం జగామ హ | విధిం నత్వాsబ్రవీత్కామజయం స్వస్య తపోబలాత్‌ || 37

తదాకర్ణ్య విధిస్సోsథ స్మ్వత్వా శంభుపదాంబుజమ్‌ | జ్ఞాత్వా సర్వం కారణం తన్నిషిషేధ సుతం తదా || 38

మేనే హితం న విధ్యుక్తం నారదో జ్ఞాని సత్తమః | శివమాయామోహితశ్చ రూఢచిత్తమదాంకురః || 39

శివేచ్ఛా చ యాదృశీ లోకే భవత్యేవ హి సా తదా | తదధీనం జగత్సర్వం వచస్తథ్యం స్థితం యతః || 40

రాబోవు కర్మఫలముల చాల బలీయమైనదని విద్వాంసులు తెలియవలెను. మానవులెవ్వరైననూ కర్మగతిని తప్పించుకొనలేరు. శంకరునని ఇచ్ఛానుసారముగా కర్మగతి ప్రవర్తిల్లును (36). అపుడా మహర్షి బ్రహ్మలోకమునకు వెళ్లి, బ్రహ్మకు నమస్కరించి, తాను తన తపశ్శక్తి చేత కాముని జయించితినని చెప్పెను (37). విధి ఆ మాటలను విని శంభుని పాదపద్మములను స్మరించి, కాముని జయించుటకు గల కారణము నెరింగి, కుమారుడగు నారదుని అట్లు ప్రచారము చేయవద్దని నివారించెను (38). నారదుడు గొప్ప జ్ఞానియే అయిననూ, శివమాయచే మోహితుడగుటచే, అతని మనస్సునందు గర్వము అంకురించి, బ్రహ్మ గారి మాటను పెడచెవిని పెట్టెను (39). లోకమునందు సర్వము శివుని ఇచ్ఛ ప్రకారమే జరుగును. జగత్తంతయూ శివుని అధీనమునందుండును. ఇది సత్యము (40).

నారదోsథ య¸° శీఘ్రం విష్ణులోకం వినష్టధీః | మదాంకురమనా వృత్తం గదితుం స్వ తదగ్రతః|| 41

ఆగచ్ఛంతం మునిం దృష్ట్వా నారదం విష్ణురాదరాత్‌ | ఉత్థిత్వాగ్రే గతోsరం తం శిశ్లేష జ్ఞాతహేతుకః || 42

స్వాసనే సముపావేశ్య స్మృత్వా శివపదాంబుజమ్‌ | హరిః ప్రాహ వచస్తథ్యం నారదం మదనాశనమ్‌ || 43

వివేకము నశించి గర్వము అంకురించిన మనస్సు గల నారదుడు తరువాత వెనువెంటనే తన గొప్పదనమును ప్రకటించుటకు విష్ణులోకమునకు వెళ్లెను(41).నారద మహర్షి వచ్చుచుండుటను గాంచి, విష్ణువు లేచి, కొద్ది దూరము ఎదురేగి కౌగిలించుకొనెను. నారదుని రాకకు కారణము ఆయనకు విదితమే (42). విష్ణువు నారదుని తన ఆసనముపై కూర్చుండబెట్టి, శివుని పాదపద్మములను స్మరించి అతని గర్వమును పోగొట్టు సత్యవచనముల నిట్లు పలికెను (43).

విష్ణురువాచ |

కుత ఆగమ్యతే తాత కిమర్థమిహ చాగతః | ధన్యస్త్వం మునిశార్దూల తీర్థోsహం తు తవాగమాత్‌ || 44

విష్ణు వాక్యమితి శ్రుత్వా నారదో గర్వితో మునిః | స్వవృత్తం సర్వమాచష్ట సమదం మద మోహితః|| 45

శ్రుత్వా మునివచో విష్ణుస్స మదం కారణం తతః | జ్ఞాతవానఖిలం స్మృత్వా శివపాదాంబుజం హృది || 46

తుష్టావ గిరిశం భక్త్యా శివాత్మా శైవరాడ్‌ హరిః | సాంజలిర్విసుధీర్నమ్ర మస్తకః పరమేశ్వరమ్‌ || 47

విష్ణువు ఇట్లు పలికెను -

వత్సా! ఎచటనుండి వచ్చుచున్నావు?ఇచటకు వచ్చుటకు కారణమేమి? ఓమునిశ్రేష్ఠా! నీవు ధన్యుడవు. నీ రాకచే నేను పవిత్రుడనైతిని (44). విష్ణువు యొక్క ఈ మాటలను విని, గర్వితుడగు నారద మహర్షి మోహమునకు వశుడై అహంకారముతో తన వృత్తాంతమును చెప్పెను (45). అపుడు విష్ణువు గర్వముతో నిండియున్న మహర్షి వాక్యములను వినెనే గాని, కామజయమునకు గల వాస్తవ కారణము ఆనకు విదితమే . ఆయన శివుని పాదపద్మములను హృదయములు స్మరించెను (46). శివభక్తులలో శ్రేష్ఠుడు, పరిశుద్ధమగు అంతఃకరణము గల వాడునగు విష్ణువు శిరసువంచి, దోసిలి యొగ్గి పరమేశ్వరుని భక్తితో స్తుతించెను (47).

విష్ణురువాచ |

దేవదేవ మహాదేవ ప్రసీద పరమేశ్వర | ధన్యస్త్వం శివ ధన్యాతే మాయా సర్వవిమోహినీ || 48

ఇత్యాది స స్తుతిం కృత్వా శివస్య పరమాత్మనః | నిమీల్య నయనే ధ్యాత్వా విరరామ పదాంబుజమ్‌ || 49

యత్కర్తవ్యం శంకరస్య స జ్ఞాత్వా విశ్వ పాలకః | శివ శాసనతః ప్రాహ హృదాథ మునిసత్తమమ్‌ || 50

విష్ణువు ఇట్లు పలికెను -

హే శివ! నీవు దేవదేవుడవు. మహాదేవుడవు. అనుగ్రహింపుము. నీవు ధన్యుడవు. అందరినీ మోహింపజేయు నీ మాయ ధన్యము (48). ఈ విధముగా ఆయన పరమేశ్వరుని స్తుతించి, కళ్లను మూసుకుని, శివుని పాదపద్మములను ధ్యానించి, విరమించెను (49). శివుని యాజ్ఞచే జగత్తును పరిపాలించు విష్ణువు మనస్సులో శంకర కృతమగు కామజయమును ఎరింగి, నారద మహర్షితో నిట్లనెను (50).

విష్ణు రువాచ |

ధన్యస్త్వం ముని శార్దూల తపోనిధిరుదారధీ | భక్తిత్రికం న యస్యాస్తి కామ మోహాదయో మునే || 51

వికారాస్తస్య సద్యోవై భవంత్య ఖిలదుః ఖదాః | నైష్ఠికో బ్రహ్మచారీ త్వం జ్ఞానవైరాగ్యవాన్‌ సదా || 52

కథం కామవికారీ స్యా జన్మ నాsవికృతస్సుధీః |

విష్ణువు ఇట్లు పలికెను -

ఓ మునిశ్రేష్ఠా! నీవు ధన్యుడవు. తపస్సునకు నిధివి. గొప్ప జ్ఞానివి. ఓ మహర్షీ! భక్తి జ్ఞానవైరాగ్యములనే మూడు లేనివానికి (51), సర్వ దుఃఖములనిచ్చే కామ మోహాది వికారములు శీఘ్రమే కలుగును. నీవు నైష్ఠిక బ్రహ్మచారివి. సదాజ్ఞాన వైరాగ్యములు గలవాడవు (52). నీవు జన్మప్రభృతి వికారములు లేని వాడవు. గొప్ప జ్ఞానివి. నీకు కామవికారమెట్లు కలుగును?

ఇత్యాద్యుక్తం వచో భూరి శ్రుత్వా స మునిసత్తమః || 53

విజహాస హృదా నత్వా ప్రత్యువాచ వచో హరిమ్‌ |

నారద ఉవాచ |

కిం ప్రభావః స్మరస్స్వామిన్‌ కృపా యద్యస్తి తే మయి || 54

ఇత్యుక్త్వా హరి మానమ్య య¸° యాదృచ్ఛికో మునిః || 55

ఇతిశ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ప్రథమ ఖండే సృష్ట్యు పాఖ్యానే నారదతపోవర్ణనం నామ ద్వితీయేsధ్యాయః (2).

ఈ విధముగా అనేకములగు పలుకులను విని ఆ మహర్షి పెద్దగా నవ్వెను (53). అతడు మనస్సులో విష్ణువునకు నమస్కరించి ఇట్లు బదులిడెను.

నారదుడిట్లు పలికెను -

ప్రభూ! నీదయ నాయందున్నచో మన్మథుని సామర్థ్యమెంతటిది? (54). ఇట్లు పలికి విష్ణువునకు నమస్కరించి ఆ మహర్షి తనకు తోచిన దారిన వెళ్లెను (55).

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు మొదటి ఖండమగు సృష్ట్యుపాఖ్యానములో నారదతపోవర్ణనమనే రెండవ అధ్యాయము ముగిసినది (2).

Sri Sivamahapuranamu-I    Chapters