Neetikathamala-1    Chapters    Last Page

1. యయాతి యయాతి నహుషరాజ నందనుడు. మహేంద్రునివలె ధర్మ మార్గంలో అనేక వేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. అనేక దానధర్మాలు, యజ్ఞ యాగాదులు చేసిన పుణ్యశీలి యయాతి.
2. పద్మపాదుడు

శ్రీ శంకర భగవత్పాదుల శిష్యులలో సనందను డొకడు. సద్గుణ సంపన్నుడు. విశేషనియమ నిష్ఠాగరిష్ఠుడు. గురుభక్తి లో అందరికన్నమిన్న. శంకరు లాతని యోగ్యత కానందించి యతనిచే ప్రస్థాన త్రయమును ముమ్మారు

3. జనమేజయుడు

జనమేజయుడు పరీక్షిన్మహారాజు పుత్రుడు. పరీక్షీత్తు మరణించిన పిదప అతని కూమారుని రాజుగా చేశారు. సర్వ శత్రు సంహార సమర్థుడని వానిని జనమేజయ నామంతో పిలిచేవారు. కాశీరాజు పుత్రి వపుష్టమ అతని భార్య.

4. దిలీపుడు దిలీపుడు సూర్యవంశ ప్రభువు. ఆకార సదృశ##మైన ప్రజ్ఞావిశేషముతో, ప్రజ్ఞా సదృశ##మైన శాస్త్ర పాండిత్యముతో, శాస్త్ర పాండిత్యమునకు సదృశ్యమైన కార్యనిర్వహణ సామర్థ్యముతో, తత్కార్యోచిత సత్ఫలములతో అరిజన
5. ద్రౌపది ద్రౌపది ద్రుపదరాజనందన. పాండవ పట్టమహిషి ఆమె. వీరనారీ శిరోమణియే కాదు. ధర్మాధర్మ వివేకశీలి . కరుణామయి.
6. కుమారిల భట్టు పేరోలగము. ఆనాడు సభ పండిత పామరులతో సముద్రమును బోలి ఉండెను. సువర్ణకుండలములతో సూర్యసమ తేజస్వియైన పండితు డొకడు సువర్ణాసనముపై కూర్చుండి ఉండెను. అతని ముఖమండలముపై
7. చ్యవనుడు

ఇక్ష్వాకుని సోదరులలో శర్యాతి ఒకడు. అతడు ఆనర్త దేశమును పరిపాలించుచుండెను. ఒకనాడు శర్యాతి తన భార్యలను కుమార్తెలను వెంటపెట్టుకొని సపరివారంగా వేటకై అడవికి వెళ్లెను.

8. వాల్మీకి అతి భయరకరమైన కాననసీమ. ఆ ప్రాంతములో తమసానది ఉత్తుంగతరంగములతో పొంగి పొరలుచుండెను. చండమార్తాండుడు సహస్రకిరణములతో మండిపడుచుండెను. ఆ మట్టమధ్యాహ్నవేళ ఆ కాంతారపథములొ
9. నచికేతుడు పూర్వము వాజశ్రవుడను ఋషిపుంగవుడు కలడు. ఆయన కుమారుడు నచికేతుడు. నచికేతుడు బుద్దికుశలుడు; బ్రహ్మచర్య దీక్షావ్రతుడు. వాజశ్రవుడు''విశ్వజిత్తు'' అను పేరుగల యజ్ఞము చేశాడు.
10. శిబిచక్రవర్తి శిబి ఉశీనరరాజనందనుడు. సర్వగుణ సంపన్నుడు. మహాదాతగా విశ్వవిఖ్యాతి పొందాడు. అతని ఆత్మత్యాగాన్ని ఆర్తత్రాణపరాయణత్వాన్నీ ఇంద్రాగ్నులు పరీక్షించారుకూడ.
11. శ్రీరాముడు దశరథ నందనుడైన శ్రీరామచంద్రుడు సకల సద్గుణసాంద్రుడు; ఆయన సత్యపరాక్రముడు. శరణాగత రక్షకుడు. ఏకపత్నీ వ్రతుడు. సర్వభూత హితుడు. దృఢవ్రతుడు. కృతజ్ఞుడు. ధర్మస్వరూపుడు.
12. గోదాదేవి విష్ణుచిత్తుడు తన చిత్తమును విష్ణువునందు లగ్నముచేసిన సార్థకనాముడు. శేషశాయి మందిర ప్రాంగణమున తులసి మొక్కలు, వివిధ పుష్పజాతులను పెంచాడు. ప్రతి దినము వివిధ పుష్పములతో అందంగా
13. నహుషుడు నహుషుడు పురువంశోద్భవ నరపాలుడైన ఆయువు యొక్క కుమారుడు. మహా శక్తిమంతుడు. పాండవులకు ఎన్నో తరముల ముందువాడు. అకుంఠిత దీక్షాయుతుడై అనేక యజ్ఞములు చేసిన తర్వాత తపస్సచేసి
14. అర్జునుడు అర్జునుడు పాండవమధ్యముడు. కుంతీపుత్రుడు. వ్యాసమహర్షి ప్రేరితుడైన ధర్మరాజు ఆజ్ఞప్రకారం కౌరవులను జయించుటకు దివ్యాస్త్రాలు సంపాందించుటకై తపోదీక్ష స్వీకరించాడు. సమస్త దేవతాశక్తులూ
15. అహంకారాసురుడు అనాదినుండి తమ ప్రవృత్తుల కారణంగా దేవాసురుల మధ్య సంగ్రామాలు జరుగుచుండెడివి. ఒక్కొకతరి అవి భయంకరరూపమునొందెడివి. ఒకసారి దేవాసురులమధ్య ఒక దారుణ యుద్ధం జరిగింది.
16. శబరి రామ లక్ష్మణులు సుగ్రీవుని కలుసుకోవడానికి పంపాసరోవర పశ్చిమ తీరానికి వచ్చారు. అక్కడ పుణ్యశ్లోకుడైన మతంగమహాముని ఆశ్రమం ఉన్నది. ఆ వనం ఆయన నిర్మించినదే కావున ''మతంగవన'' మంటారు.
17. జడభరతుడు ఋషభరాజేంద్రుని కుమారుడు భరతుడు. తన సోదరుల రాజ్యాలకు సంరక్షకుడుగా ఉంటూ భరతుడు అవక్ర పరాక్రమంతో చాల కాలం రాజ్యపాలన గావించాడు.
18. భీష్ముడు కురువంశ నృపాలుడైన శంతన రాజేంద్రుని కుమారుడు దేవవ్రతుడు. సంప్రాప్తమైన సామ్రాజ్యాన్ని పితృప్రియం కొరకై తిరస్కరించి బ్రహ్మచర్య దీక్షితుడైన సత్యభాషి, ఆ దేవవ్రతుడు.
19. సతీ అనసూయ అనసూయాదేవి అత్రిమహర్షి ధర్మపత్ని. ఆమె నిరంతర పతి పాదసేవా పరాయణురాలైన మహాపతివ్రత. ఆమె తల్లి దేవహూతి. తండ్రి కర్దమ మునీంద్రుడు.
20. ఆంజనేయుడు ఆంజనేయుడు వహాబలవంతుడు. ఉదయాద్రిపై ఒక కాలు, అస్తాద్రిపై మరొక కాలు ఉంచిన మహాకాయుడు. సూర్యభగవానుని ప్రియశిష్యుడైన నవవ్యాకరణవేత్త; రామాయణ మహామాలా రత్నము.
21. వయం పంచాధికం శతమ్‌ పాండవులు అరణ్యవాసకాలంలో ద్వైతవనం చేరారు. అచట సరోవర సమీపాన విడిది చేసి ధర్మరాజు ద్రౌపదితో రాజర్షు లాచరించే సాద్యస్కవ్రతం సాగిస్తున్నాడు. అది గ్రహించాడు దుర్యోధనుడు.
22. పరశురాముడు పరశురాముడు విష్ణుమూర్తి అంశతో జన్మించి, తల్లి దుఃఖమును బాపుటకై ధర్మ పరశువును చేబూని ఇరువదియొక్క మారులు మదోన్మత్తులైన రాజులను సంహరించిన ధర్మ ప్రతిష్ఠాపకుడు.
23. నారద తుంబురులు ఒకనాడు విష్ణుమూర్తి బ్రహ్మాది దేవతలు, యోగీశ్వరులు తన్ను సేవిస్తుండగా వైకుంఠంలో సభ తీరి ఉన్నాడు. కౌండిన్యుడు, అత్రి, మరీచి, కణ్వుడు, విశ్వామిత్రుడు మొదలైన ముని గణమంతా వచ్చారు.
24. నలుడు నల మహారాజు షట్చక్రవర్తులలో ఒకడు. ఆయన సదాచార సంపన్నుడు. నిషధ దేశాధిపతి. తన నిర్మలమైన చరితతో జగత్కాలుష్యమును క్షాళన మొనర్చిన ధర్మశీలుడు. మహాదాత; వివిధ
25. వ్యాసుడు వ్యాసుడు సత్యవతీ నందనుడు. వేద విభాగ మొనర్చి పంచమ వేద మనబడు మహాభారతామును రచించిన జ్ఞానమూర్తి. ఆ కారణముననే ఆయనకు ''వేద వ్యాసు'' డను పేరుకూడ వచ్చింది.
26. శంకరాచార్యులు శంకర భగవత్పాదులు అపర శంకరులు. జ్ఞానైక వేద్యమైన అద్వైత మతమును ప్రతిపాదించి భారతము నంతనూ పాదయాత్ర చేసిరి. ఆజైత్రయాత్రలో అన్యమతముల ఖండించి పరాజితులైన ఆమత ప్రముఖులను
27. ప్రహ్లాదుడు ''ప్రహ్లాద నారద పరాశర పుండరీక.............'' అను భాగవతొత్తొముల పంక్తిని ప్రహ్లాదునికే అగ్రస్థాన మీయబడెను. ప్రహ్లాదుడు హిరణ్యకశివుడను దానవేంద్రుని కనిష్ఠ కుమారుడు. వయసునందు చిన్నవాడైనను హరిభక్తి,
28. పరీక్షిత్తు పరీక్షిత్తు అభిమన్యువీరుని కుమారుడు. ఇతడు శరణాగత వత్సలుడు, సత్యప్రతిజ్ఞుడు అయిన సమ్రాట్టు. మహాభారత సంగ్రామానంతరము ద్రోణాచార్యుని పుత్రుడు అశ్వత్థామ అపాండవమ్ము చేయుమని ప్రయోగించిన
29.సావిత్రి సావిత్రి మద్ర దేశాధిపతి అయిన అశ్వపతి కుమారై. సావిత్రీదేవి వరప్రసాదం వల్ల పుట్టడంచేత అమెకు ''సావిత్రి'' అని నామకరణం చేశారు. సావిత్రి సిద్ధ, సాధ్య యక్ష, అమర కన్యలను మించిన అసాధారణ సౌందర్యరాశి.
30. ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడు కురు సమ్రాట్టు. సోదరుడైన పాండురాజు మరణానంతరము రాజ్యార్హతలేని అంధుడైనప్పటికీ రాజయ్యాడు. పాండుకుమారులను ఆదరించి తన కుమారులతో పెంచాడు.
31. చంద్రహాసుడు చంద్రహాసుడు కేరళ##దేశాధీశ్వరుని కుమారుడు. సౌభాగ్యలక్షణసంపన్నుడు. కందర్ప సదృశ రూప రేఖా విలాసభాసురుడు. తేజోవిరాజమానుడు. కాని ఆతడు బాల్యము నందే తల్లి దండ్రులను కోల్పోయాడు.
32. కర్ణుడు సర్వ సాక్షియైన సూర్య భగవానుని వరప్రభావంవల్ల కుంతీదేవికి సద్యో గర్భంలో పుట్టినవాడు కర్ణుడు. కాని దైవ ఘటన వలన సూతపుత్రుడై పెరిగి, దుర్యోధనుని మైత్రిచే అంగరాజైనాడు. కర్ణుడు మహాదాత,
33. రామబాణప్రభావము శ్రీరఘు వీర కోదండ వినిర్ముక్త శరము అప్రతిహతము, అమోఘము, అమేయము, దాని శక్తి అపారము. దానెదిరించి నిలువగల వీరుడు ముల్లోకములలో లేడు . రామబాణ హతులై జీవించిన వారు లేరు.
34. నామదేవుడు నామధేవుడు అక్రూరాంశవలన జన్మించాడు. భక్తిభావంతో నిరంతరము పాండురంగని సేవించేవాడు. పాండురంగడు ఆతనికి దర్శనమిచ్చి తన ప్రియమైన భక్తునిగా స్వీకరించాడు. పాండురంగని కృపవలన అతనికి జ్ఞానదేవుడు,
35. మాలదాసరి విష్ణుభక్తి సంకీర్తనలతో తాను తరించుటయే గాక; సంకీర్తన శ్రవణ మాత్రమున ఇతరులనుగూడ తరింప జేసిన భక్తాగ్రగణ్యుడు మాలదాసరి. ఆతడు చెప్పరాని కులమునకు చెందినవాడు.
36. అగస్త్యుడు అశేష జలరాశిని అరనిముసంలో ఆపోశనం చేసిన మహోగ్రతేజ స్సంపన్నుడు, ప్రాతఃస్మరణీయుడు-అగస్త్యమహర్షి. లోపాముద్రా ద్వితీయుడై కై వల్య లక్ష్మి కుల గృహమైన పుణ్యౖకరాశి-కాశియందు
37. తిన్నడు ''ఓ బాలకా! ఇచటికి సమీపంలోనే కొండ దగ్గర మొగలేరు ప్రక్కనే పార్వతీపతి అయిన పరమశివుడు వేంచేసి ఉన్నాడు.... ఆ స్వామి భక్తులపాలిటి పెన్నిధి. ఆయనను భక్తితో సేవించు.''
38. ఖాండిక్యకేశిధ్వజులు  ఖాండిక్య కేశిధ్వజులు అకుంఠిత విష్ణుభక్తులు. నిమివంశజులు. ఖాండిక్యుడు మహావిజ్ఞాని. కేశిధ్వజుడు కర్మఠుడు. వీరిద్దరు అన్నదమ్ములు. పినతండ్రి పెదతండ్రి బిడ్డలు. వీ రిరువురు రాజ్యముకొరకై పరస్పర
39. సులోచన  సులోచన నాగరాజు కుమార్తె. లంకాధీశ్వరుడైన రావణ ప్రభువు కోడలు. మహావీరుడైన మేఘనాదుని అర్ధాంగి. లక్ష్మీజగన్నేతలకు సాధ్యము కాని పనిని ఆత్మ బలముతో సాధించిన మహాపతివ్రత సులోచన.
40. యక్షప్రశ్నలు  సోదర సహితుడై ధర్మరాజు అర్థియైన ఒక బ్రాహ్మణుని కోర్కె నెరవేర్చుటకు ఒక మృగాన్ని వెంబడించాడు. పాండవులు ఎన్ని అస్త్రాలు విడచినా, ఏ మాత్రం క్లేశం పొంద కుండా ఆ మృగం పారిపోయింది.

Neetikathamala-1    Chapters    Last Page