Upanyasamulu    Chapters   

సనాతనుల కర్తవ్యమేమి?

యత్రయోగీశ్వరఃకృష్ణః యత్రపార్థోధనుర్ధరః

తత్రశ్రీర్విజయోభూతిః ధ్రువానీతి ర్మతిర్మమ.

ఇప్పుడు కాగితములో వ్రాయబడిన తీర్మానములు గాక మన మనస్సులో కొన్ని తీర్మానముల జేసుకొనవలెను. ఇప్పుడుచేసినవన్నియు సంఘమునకు సం బం ధిం చి న వి. చేయబోవునవి ప్రతివ్యక్తికిని సంబంధించినవి. ఇప్పటికాలంలో సనాతన ధర్మసభలకు డబ్బు వసూలు కావలెనన్నప్పటికిన్ని, సనాతన ధర్మప్రచారమునకు డబ్బు కాలవయునన్నప్పటికిని చాల కష్టముగానున్నది. ఎచ్చటనైన ఒకటిరెండు సనాతనపత్రికలున్నప్పటికిని ప్రస్తుతము వానికి బాలారిష్టము తగిలియున్నది. ఇవన్నియు మనకు సంపూర్ణముగ సనాతనధర్మముయెడ అభిమానము లేదనుటకు నిదర్శనములు. సనాతనధర్మంలో ఏమాత్రముకూడా లోపంలేదు. కాని మనంచేసే ప్రచారములో లోపమున్నది. దీని యందు శ్రద్ధలేదు. తిరుపతికొండమీదికిపోయి ప్రతిదినముకూడా రాత్రింబవళ్ళు ఎంత మందిభక్తులు వచ్చుచున్నారో ఎంతమంది వెళ్లుచున్నారో చూచినట్లయితే, ఇంకాదేశములో సనాతనధర్మము అడుగంటలేదనీ, భక్తిపోలేదని స్పష్టమౌతుంది. అట్లే కాకినాడలో 'తుల్యా, అని ఒకనది ఉన్నది. అది గోదావరి ఏడుపాయలలోనొకటి, అందిప్పుడు మోకాటిలోతు బురదమాత్రమున్నది. కాని భక్తులు ప్రతిరోజు అచ్చటనే స్నానముచేయుచున్నారు. వీటివల్లనసనాతనధర్మము ఎంతసత్యమైనదని, నిత్యమైనదనీ నమ్మినా మన ప్రచారముమాత్రము బాగులేదు అని నా అభిప్రాయము.

మనమూరక ఇదిపనికిరాదు. అదిపనికిరాదు. అని చెప్పుదుముకాని చేయవలసినదేమో చెప్పము. ఇప్పుడు ముదిగొండ వెంకట్రామశాస్త్రిగారు గురుకులాశ్రమ నిర్మాణమునకై కష్టించి 20 వేల రూపాయలను సంపాదించినామన్నారు. ఇప్పుడు మనకావిధముగ పనిచేయువారు కావలెను. దేశంలోని ప్రజలు చాలమంది కాంగ్రెస్‌ మీద అభిమానముకలిగి ఉన్నారంటే అది కాంగ్రెసు చేసిన త్యాగము. నిరాడంబరము వీటిమీద ఆధారపడి యున్నది. మనలో అటువంటిత్యాగములేదు. మనముకూడా స్వార్థమువదలి త్యాగమున దృష్టినిలిపినచో మన సనాతన పత్రిలకు, మనధర్మమునకు, మన ప్రచారమునకు, అన్నిటికిని మంచి ఉచ్ఛస్థితి వచ్చితీరుతుంది. కాంగ్రెసువారి సిద్ధాన్తముల గిట్టనివారు చాలామంది కాంగ్రెసులోనేకలరు. వారందరు కాంగ్రెసునకే ఓటుచేయుదురు. కారణమేమి? కొన్నివిషయములలో వారు త్యాగమునుచూపి ప్రచారము చేయుచున్నారు. ఆ త్యాగమే ఇతరులను ఓటుచేయించుచున్నది. కాబట్టి మనముకూడా అట్టిత్యాగము చేయవలెను. నాడే మన సనాతనధర్మము జనసామాన్యమున వ్యాపించి విజయవంతము కాగలదు.

ప్రస్తుతముమీకు కర్తవ్యములగు రెండు మూడు విషయములను మాత్రము చెప్పెదను.

(1) గ్రామములోని పంచములు మనము వారికేలాటి సహాయము చెయ్యమేమో అను భయముతో వారికి కావలసిన సామాన్యమగు నీటివసతి మున్నగు సదుపాయములకుగూడ గవర్నమెంటువారినే కోరుచున్నారు. కాని మనము సాధ్యమైనంతవరకు వారికి సహాయము చేయవలెను. అది మనవిధి. అత్యంత అవసరముకూడాను.

(2) క్రైస్తవమతమువారు తమ యిచ్చవచ్చినటుల ప్రచారమొనర్చి చాలమంది మనవారిని తమలో కలుపుకొనుచున్నారు. కాబట్టి మనమీ విషయమునందు ప్రమత్తులముగాక క్రైస్తవ ప్రచారకులు వెళ్ళినగ్రామములకు ఆస్థలములకు మనముకూడా వెళ్లి మనసంఘములనుకూడ నటస్థాపించి, అచ్చటి ప్రజలకు మన మతధర్మముల బోధించి మనమతమును మనము కాపాడుకొనవలయును. ఇది సనాతనుల కవశ్యకర్తవ్యమైయున్నది. ఇందుకు వలయుధనము లేదని ఊరకుండక ధనము యాచించి అయినను చేయుటముఖ్యము. మరియు మనము దినమున కొక వ్యక్తినయినను సంధ్యావందన మాచరించవలసినదనియు, భగవన్నామమము స్మరించుమనియు, ప్రార్థించవలయును. వారిచే ననుష్ఠింపజేయవలయును. ప్రతివారు ప్రతిదినముకూడా పరోపకారము చేయుచుండవలెను? ఇతరులను చేయుడు అని ప్రార్థించవలెను. వినకపోయిన మనము వారి పాదములనయిన పట్టుకొని వారినంగీకరింపజేయవలెను.

వై జెప్పిన కార్యములను మనగ్రామములలో మన పరిసరములలో మనమేమరక ప్రతినిత్య మనుష్ఠించవలయును. ఇది మన ధర్మము. ఇదియే సనాతన ధర్మపరుల కవశ్యాచరణీయము ముఖ్యముగా మనమందరమొకటిగచేరి మనమతమునువీడి మతాంతరముల కలియువారిని నిరోధించవలెను. మన మతగౌరవమును కాపాడవలెను. ఇదియే మానవసేవ. ఇదియే భగవత్సేవ. ఇదియే మన సమస్త వేదములయొక్కయు, శాస్త్రముల యొక్కయు తాత్పర్యమైయున్నది. ఈ తీర్మానములనే నేను మొదట ప్రతివాని హృదయమున చేసుకొనవలయునని చెప్పినది. దీనినే గీతలలో

యత్రయోగీశ్వరః కృష్ణః యత్ర పార్థో దనుర్థరః.

అని చెప్పబడినది.

మనకిప్పుడు రానున్న, జాతి, మత, భ్రంశకములగు చట్టములు రద్దుకావలయునన్న, నేజెప్పిన ఈ పనులను ప్రతి వారాచరణకు తేవలయును.

ఉద్యోగినం పురుషసింహ ముపైతి లక్ష్మీః.

పనిచేయువానికి విజయము రాకతప్పదు, కాబట్టి మీరందఱు నేటినుండియే అట్టి కార్యాచరణమునకు గడుంగుడు. విజయము రాకతప్పదు."

-----

Upanyasamulu    Chapters